MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ.. ఇవాళ నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్..

|

Nov 09, 2021 | 8:02 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌ వెలువడనుంది. తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

MLC elections: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ.. ఇవాళ నోటిఫికేషన్‌ వచ్చే ఛాన్స్..
Mla Quota Mlc Elections
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి షురూ అయింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్‌ వెలువడనుంది. తెలంగాణలో 6 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాల్టినుంచే నామినేషన్లను స్వీకరిస్తారు. టీఆర్‌ఎస్‌ ఇవాళ అభ్యర్థుల పేర్లు ప్రకటించే ఛాన్స్‌ ఉంది. టీఆర్‌ఎస్‌కే ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉండటంతో 6 ఎమ్మెల్సీలు ఏకపక్షం కానున్నాయి. ఇక నామినేషన్ల దాఖలుకు ఈ నెల 16వరకు గడువుంది.

ఇదిలావుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఎమ్మెల్యే కోటా ఎంఎంఎల్సీ స్థానాల భర్తీకి ఇవాళ నోటిఫికేషన్‌ రానుంది. ఇందులో భాగంగా ఈ నెల 16 వరకూ నామినేషన్ల స్వీకరణ, నవంబరు 17 నుంచి నామినేషన్లను పరిశీలించి.. నవంబరు 22న ఉపసంహరణ.. నవంబరు 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు మే 31తో ఖాళీకాగా.. తెలంగాణలో జూన్ 3న ఆరు స్థానాలు ఖాళీగా ఉన్న సంగతి తెలిసిందే. మే 31న మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్, సోము వీర్రాజు (బీజేపీ ), గోవిందరెడ్డి (వైసీపీ)ల పదవీకాలం ముగియడంతో వారి స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.

దీంతో మూడు స్థానాలూ ఖాళీగా ఉన్నాయి. మరోవైపు, శాసనమండలిలో మొత్తం 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల నుంచి 11, ఎమ్మెల్యేల కోట నుంచి మరో 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది. గత 6 నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఖాళీల భర్తీకి సంబంధించి నిన్నటి వరకు హైకోర్టు తీర్పు అడ్డంకిగా ఉండేది. అయితే, కోర్టు అనుమతితో కౌంటింగ్ పూర్తయి అన్ని జిల్లాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల భర్తీ పూర్తి అయింది. మొత్తంగా చూసుకుంటే.. రాష్ట్ర శాసనమండలిలో 58 స్థానాలు ఉండగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే 18 స్థానాలు ఉన్నాయి. ఖాళీగా ఉన్న 14 స్థానాలు భర్తీ చేస్తే అన్నీ వైసీపీ ఖాతాలో పడనున్నాయి. దీంతో వైసీపీ బలం పెరిగి శాసనమండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను సైతం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి: Rafale Deal: మధ్యవర్తికి డసాల్ట్‌ ఏవియేషన్‌ రూ.481 కోట్ల లంచం.. మరోసారి తెరపైకి వచ్చిన రాఫెల్‌ డీల్‌ భూతం..

Sania Mirza Video: భర్త షాయబ్ మాలిక్ సిక్సర్ల మోత.. పాక్ క్రికెటర్ ఆటను ఎంజాయ్ చేసిన సానియా..