Disha Accused Encounter: భారీ భద్రత నడుమ ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్‌ కమిషన్‌..

|

Dec 05, 2021 | 3:00 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితులు ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతోంది.  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్ట్‌ నియమించిన సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.

Disha Accused Encounter: భారీ భద్రత నడుమ ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని పరిశీలించిన సిర్పూర్కర్‌ కమిషన్‌..
Sirpurkar Commission
Follow us on

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ నిందితులు ఎన్‌కౌంటర్ కేసు దర్యాప్తు శరవేగంగా సాగుతోంది.  దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్ట్‌ నియమించిన సిర్పూర్కర్‌ కమిషన్‌ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చటాన్‌పల్లిలో ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు సిర్పూర్కర్‌ కమిషన్‌ సభ్యులు. దిశ డెడ్‌బాడీని కాల్చిన స్థలంతో పాటు షాద్‌నగర్‌ టోల్‌గేట్‌ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. 30నిమిషాల పాటు ఆ ప్రాంతాల్లో తిరిగిన కమిషన్‌ సభ్యులు..అసలేం జరిగిందన్న అంశాలపై ఆరా తీశారు. సిర్పుర్కర్‌ కమిషన్‌ పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆగస్టు 21న ప్రారంభమైన కమిషన్ విచారణ…. నవంబర్ 25వ తేదీ వరకు కొనసాగింది. హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో విచారణ మొదలు పెట్టిన కమిషన్ సభ్యులు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు.

2019 నవంబర్‌ 27న హైదరాబాద్‌ శివారులోని శంషాబాద్‌లో దిశ ఘటన జరిగింది. ఆ తర్వాత వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పారిపోయేందుకు ప్రయత్నించడంతో ఎన్‌కౌంటర్‌ చేశారు. ఐతే ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అంటూ వచ్చిన కంప్లైంట్స్‌తో ఈ ఘటనపై దర్యాప్తుకు జస్టిస్‌ సిర్పూర్కర్‌ కమిషన్‌ను నియమించింది సుప్రీం కోర్టు. ఇక ఇప్పటికే ఆ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అప్పటి సీపీ సజ్జనార్‌తో పాటు, మహేశ్ భగవత్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను విచారించింది సిర్పూర్కర్‌ కమిషన్‌. . మృతుల కుటుంబసభ్యుల నుంచి సాక్ష్యం నమోదు చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోపు సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

Also Read: అనసూయ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతున్న స్టార్ యాంకర్

చెత్త ఏరుకునే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్న వివాహిత.. మర్డర్ కేసు విచారణలో నమ్మలేని విషయాలు