తిరుమల చేరుకున్న కేటీఆర్

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తిరుమల చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, మధుసూధన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం కుటుంబ సమేతంగా కేటీఆర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో టీటీడీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఛైర్మన్ […]

తిరుమల చేరుకున్న కేటీఆర్
Follow us

| Edited By:

Updated on: Jan 05, 2020 | 6:04 PM

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తిరుమల చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు ఆయన తిరుమలకు వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి, మధుసూధన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా సోమవారం కుటుంబ సమేతంగా కేటీఆర్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. మరోవైపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో టీటీడీ అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.