ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగింది. స్మార్ట్ఫోన్ వినియోగంలో అమెరికా, చైనా తర్వాత భారత్ తర్వాతి స్థానంలో ఉంది. అలాగే డేటా వినియోగంలో ప్రపంచ దేశాల సరసన భారతదేశం నిలిచింది. ప్రస్తుతం రోజుల్లో ప్రతి ఒక్కరి స్మార్ట్ఫోన్ అనేది తప్పనిసరైంది. ఓ మాటలో చెప్పాలంటే స్మార్ట్ఫోన్ కూడా నిత్యావసరంగా మారింది. పెరిగిన డిమాండ్ నేపథ్యంలో అన్ని కంపెనీలు సరికొత్త స్మార్ట్ఫోన్లు లాంచ్ చేస్తున్నాయి. భారతదేశంలో ఐటెల్ కంపెనీ తాజాగా పీ 55, పీ 55 ప్లస్ పేరుతో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఇవి 90హెచ్జెడ్ రిఫ్రెష్ రేట్తో 6.6 అంగుళాల హెచ్డీ ప్లస్ స్క్రీన్తో వస్తున్నాయి. యూనిసాక్ టీ 606 ఎస్ఓసీ ఆధారంగా పని చేసే ఈ ఫోన్లు 8 జీబీ ర్యామ్ వేరియంట్లో అందుబాటులో ఉంటాయి. అలాగే 16 జీబీ వరకూ వర్చువల్ ర్యామ్ను పొందివచ్చు. ముఖ్యంగా ఈ ఫోన్లో ఉండే ఐబూస్ట్ ఫీచర్ మెరుగైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లతో పాటు ధర ఇతర విషయాలపై ఓ లుక్కేద్దాం.
ఐటెల్ ఫిబ్రవరి చివరి వారంలో ఐటెల్ పీ 55 టీ లాంచ్ని ధ్రువీకరించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ అని కంపెనీ చెప్పింది. ఐటెల్ పీ 55 మూన్లిట్ బ్లాక్, అరోరా బ్లూ, బ్రిలియంట్ గోల్డ్ రంగులలో వస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 7499 (రూ. 500 బ్యాంక్ తగ్గింపుతో రూ. 6999) 4 జీబీ (8 బీ వర్చువల్ ర్యామ్ ) + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఆన్లైన్ కోసం, 8 జీబీ (16 జీబీ వర్చువల్ ర్యామ్ ) + 128 జీబీ స్టోరేజ్ వెర్షన్ ఆఫ్లైన్ మార్కెట్ ధర రూ. 8999 గా ఉంది. ఐటెల్ పీ 55 ప్లస్ రాయల్ గ్రీన్, మీటోర్ బ్లాక్ రంగులలో వస్తుంది. అలాగే ఈ ఫోన్ ధర రూ.9999 ఉంది. అయితే రూ.500 బ్యాంకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఈ ఫోన్ అమెజాన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..