Study: రైతన్నలకు సాయం చేస్తున్న గబ్బిలాలు.. వరి పంటను కాపాడడంలో..

|

Oct 13, 2023 | 4:10 PM

జర్నల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఎకో సిస్టమ్‌ అనే జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు. అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుల్లో ఒకరైన ఇక్బాల్‌ భల్లా మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని రక్షించడంలో గబ్బిలాల పాత్ర కీలకమైంది. భారతీయ వ్యవసాయంలో గబ్బిలాల ద్వారా ఎంతమేర ఆర్థికంగా లాభపడుతున్నారన్న అంశాన్నిరాబోయే రోజుల్లో మరింత కచ్చింగా చెప్పగలమని ఇక్బాల్‌ తెలిపారు. వ్యవసాయంలో పురుగుమందులపై...

Study: రైతన్నలకు సాయం చేస్తున్న గబ్బిలాలు.. వరి పంటను కాపాడడంలో..
Bats
Follow us on

గబ్బిలాలు వరి పంటను కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇటీవల అస్సాంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. 2019లో వరి సీజన్‌లో నిర్వహించిన అధ్యయనంలో భాగంగా.. వరి పంటను నాశనం చేసే పురుగులను గబ్బిలాలు అణచివేస్తున్నాయని తద్వారా పంట దిగుబడి గణనీయంగా పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు.

జర్నల్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఎకో సిస్టమ్‌ అనే జర్నల్‌లో ఈ విషయాలను ప్రచురించారు. అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుల్లో ఒకరైన ఇక్బాల్‌ భల్లా మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని రక్షించడంలో గబ్బిలాల పాత్ర కీలకమైంది. భారతీయ వ్యవసాయంలో గబ్బిలాల ద్వారా ఎంతమేర ఆర్థికంగా లాభపడుతున్నారన్న అంశాన్నిరాబోయే రోజుల్లో మరింత కచ్చింగా చెప్పగలమని ఇక్బాల్‌ తెలిపారు. వ్యవసాయంలో పురుగుమందులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 1992లో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ (IPM) అనే క్యార్యక్రమాన్ని భారత్‌లో ప్రవేశపెట్టారు. ఇది వ్యవసాయ ఉత్పత్తిలో కీటక తెగుళ్లను నియంత్రించడానికి జీవ, సాంస్కృతిక, రసాయన పద్ధతుల వినియోగాన్ని మిళితం చేస్తుంది. ఈ కార్యక్రమం కింద, వ్యవసాయ తెగుళ్లను నియంత్రించడానికి చేపలు, కప్పలు, పరాన్నజీవులు, బాతులు వంటి సహజ వేటాడే జంతువులను ఉపయోగిస్తున్నారు.

గత దశాబ్ధంలో వరిలో తెగుల నిర్వహణ కోసం గబ్బిలాలు ఉపయోగపడుతున్నాయి. వరి నాశనానికి కారణమైన తెగుళ్లను గబ్బిలాలు తినడం ద్వారా పంటలను కాపాడుతాయి. ‘నా అనుభవం ప్రకారం.. చాలా మంది రైతులకు వ్యవసాయ పర్యావరణ వ్యవస్థల గురించి చాలా స్పష్టమైన అవగాహన ఉంది. పెస్ట్ కంట్రోల్ ఏజెంట్లుగా పక్షులు, గబ్బిలాల విలువ గురించి ప్రతీ రైతుకు తెలుసు. అస్సాంలోని పొలాల్లో నేను చూసిన బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్‌లో ఒక ఆసక్తికరమైన పద్దతి వరి పొలాలలో క్రమమైన వ్యవధిలో భూమిలోకి సన్నని కొమ్మలను ఉంచడం. ఈ శాఖలు కీటకాహార పక్షులకు (ప్రధానంగా స్వాలోస్) విశ్రాంతి తీసుకోవడానికి స్థలాలను అందించాయి, తద్వారా వాటిని మరింత పొలంలోకి వెళ్లి కీటకాలను పట్టుకునేలా ప్రోత్సహిస్తుంది’ అని ఇక్బాల్‌ భల్లా చెప్పుకొచ్చారు.

అస్సాంలోని సోనిత్‌పూర్‌ జిల్లాలోని పుతమరి అనే గ్రామంలో వరి పొలాల్లో ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1,400 కంటే ఎక్కువ గబ్బిలాలు ఉన్నాయి. అయితే గబ్బిలాల సంఖ్య తగ్గడానికి వాటికి నివాసయోగ్యం ప్రాంతం లేకపోవడం ప్రధాన కారణాల్లో ఒకటిగా చెబుతున్నారు. చాలా గబ్బిలాలు వరి పొలాల చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాల్లో నివాసం ఉంటాయి.

మరిన్ని సైన్స్ వార్తల కోసం క్లిక్ చేయండి..