Telangana: ‘బంగారు’కొండలకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా.. ఆ ఛాంపియన్స్ ఇద్దరికీ రూ. 2 కోట్లు, 600 గజాల స్థలం..!

|

Jun 01, 2022 | 12:46 PM

Telangana: ఒకరు ప్రప్రంచ స్థాయిలో, మరొకరు జాతీయ సత్తా చాటి.. బంగారు పతాకాలతో మెరిసిన గోల్డెన్ గర్ల్స్ నిఖత్ జరీన్‌, ఈషా సింగ్‌‌ పై తెలంగాణ సర్కార్ కనక వర్షం

Telangana: ‘బంగారు’కొండలకు తెలంగాణ సర్కార్ భారీ నజరానా.. ఆ ఛాంపియన్స్ ఇద్దరికీ రూ. 2 కోట్లు, 600 గజాల స్థలం..!
Gold Winners
Follow us on

Telangana: ఒకరు ప్రప్రంచ స్థాయిలో, మరొకరు జాతీయ సత్తా చాటి.. బంగారు పతాకాలతో మెరిసిన గోల్డెన్ గర్ల్స్ నిఖత్ జరీన్‌, ఈషా సింగ్‌‌ పై తెలంగాణ సర్కార్ కనక వర్షం కురిపించింది. IBA 2022, మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ సాధించిన నిఖత్ జరీన్, ఎయిర్ పిస్టల్ షూటింగ్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ట్రిపుల్ గోల్డ్ మెడల్స్ సాధించినందుకు ఈషా సింగ్ ఇద్దరికీ తెలంగాణ ప్రభుత్వం రూ. 2 కోట్ల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాదు.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి లోని ఏదో ఒక ప్రాంతంలో చెరో 600 చదరపు గజాల చొప్పున స్థలం ఇవ్వనుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. మరికొద్ది సేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం. ఈ గోల్డెన్ గర్ల్స్ రివార్డులకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ సాయంత్రంలోగా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన జూన్ 2, 2022 నాడు పబ్లిక్ గార్డెన్‌లో నిఖత్ జరీన్, ఈషా సింగ్ ఇద్దరికీ చెక్కులు, భూమి పత్రాలను ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులుమీదుగా అందజేయనున్నట్లు తెలుస్తోంది.