‘ఐపీఎల్‌’ని మర్చిపోండి: గంగూలీ ఘాటు కామెంట్లు

| Edited By:

Apr 12, 2020 | 4:17 PM

ఐపీఎల్‌ 13పై సోమవారం స్పష్టతను ఇస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించారు. ఐపీఎల్ నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఘాటుగా స్పందించారు.

ఐపీఎల్‌ని మర్చిపోండి: గంగూలీ ఘాటు కామెంట్లు
Follow us on

ఐపీఎల్‌ 13పై సోమవారం స్పష్టతను ఇస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ వెల్లడించారు. ఐపీఎల్ నిర్వహణపై మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఘాటుగా స్పందించారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా జనజీవనం స్తంభించాక క్రీడలకు భవిష్యత్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహించడం కష్టమని గంగూలీ తేల్చారు.

”ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఏం చెప్పలేము. అయినా చెప్పడానికి ఏముంది. కరోనా నేపథ్యంలో విమానాశ్రయాలు మూతపడ్డాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కార్యాలయాలు తెరుచుకోలేదు. ఈ పరిస్థితి మే మధ్య వరకు ఉంటుందని భావిస్తున్నాం. ఇలాంటి స్థితిలో ఆటగాళ్లు ఎలా వస్తారు. ఐపీఎల్‌ను పక్కనపెట్టి.. ఇంగిత ఙ్ఞానంతో ఆలోచిస్తే.. క్రీడలు నిర్వహించే పరిస్థితులు ఇప్పుడు ఎక్కడున్నాయి. ఐపీఎల్ మర్చిపోండి” అని అన్నారు. చివరగా మాట్లాడుతూ.. ఐపీఎల్‌పై బీసీసీఐ అధికారులతో చర్చించి సోమవారం అప్‌డేట్ ఇస్తామని పేర్కొన్నారు.

Read This Story Also: ఓ వైపు కరోనా చికిత్స.. మరోవైపు పరీక్షలు.. స్ఫూర్తి కలిగిస్తోన్న విద్యార్థిని కథ