Adelaide Test: ఈ ఏడాది నవంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కింద రెండు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగాల్సి ఉంది. గత రెండు టూర్లలో ఆస్ట్రేలియాలో టీమిండియా తన సత్తా చాటింది. సిరీస్ను గెలుచుకుంది. కానీ, 2020 సంవత్సరంలో అడిలైడ్లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ డే-నైట్ మ్యాచ్లో, భారత జట్టు తన రెండవ ఇన్నింగ్స్లో కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు పేరు మీద అనేక అవమానకరమైన రికార్డులను మూటగట్టుకుంది. అయితే ఈసారి భారత్ పక్కా ప్లాన్తో అడుగుపెట్టాలని యోచిస్తోంది. అందుకే ఇప్పుడు పింక్ బాల్ టెస్టుకు ముందు టీమ్ ఇండియా డే-నైట్ టూ-డే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.
2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో, సిరీస్లోని మొదటి మ్యాచ్లోనే భారత జట్టు నిరాశపరిచింది. అడిలైడ్లో జరిగిన ఆ డే-నైట్ టెస్టు మ్యాచ్లో భారత జట్టు 244 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేసింది. 53 పరుగుల ఆధిక్యాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్ట్రేలియాకు బలమైన లక్ష్యాన్ని అందించే అవకాశం టీమిండియాకు ఉంది. కానీ, అది జరగలేదు. కంగారూ బౌలర్లు విధ్వంసం సృష్టించారు. భారత జట్టు రెండవ ఇన్నింగ్స్లో, ఏ బ్యాట్స్మెన్ కూడా రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. మొత్తం జట్టు 21.2 ఓవర్లలో 36 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 90 పరుగుల లక్ష్యాన్ని సులభంగానే సాధించింది.
అయితే, ఈసారి భారత జట్టు పక్కా ప్లాన్తో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. ఈ కారణంగా, పర్యటన ప్రారంభానికి ముందు, టీమిండియా నవంబర్ 15, 18 మధ్య పెర్త్లో ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ఆ తరువాత, అడిలైడ్లో ఆడబోయే పింక్ బాల్ టెస్ట్కు ముందు, అంటే, నవంబర్ 30, డిసెంబర్ 1 మధ్య కాన్బెర్రాలో జరిగే డే-నైట్ ప్రాక్టీస్ మ్యాచ్లో పీఎం ప్లేయింగ్ 11తో ఆడనుంది. దీని ప్రధాన లక్ష్యం సన్నద్ధతను బలోపేతం చేయడమేనని తెలుస్తోంది.
మొదటి టెస్ట్ : 22-26 నవంబర్, పెర్త్
రెండవ టెస్ట్ : 6-10 డిసెంబర్, అడిలైడ్ (డే/నైట్)
మూడో టెస్టు : 14-18 డిసెంబర్, బ్రిస్బేన్
నాల్గవ టెస్ట్ : 26-30 డిసెంబర్, మెల్బోర్న్
ఐదవ టెస్ట్ : 3-7 జనవరి, సిడ్నీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..