Sandeep Lamichhane Back in Nepal Team For T20 World Cup 2024: నేపాల్ ప్రముఖ స్పిన్నర్ సందీప్ లామిచానే ఎట్టకేలకు T20 ప్రపంచ కప్ 2024లో ఆడేందుకు అనుమతి పొందాడు. సందీప్ లామిచానే ఇప్పుడు నేపాల్ తరపున గ్రూప్ దశలో చివరి రెండు మ్యాచ్లలో ఆడనున్నాడు. ఈ సమాచారాన్ని ఆయనే స్వయంగా తెలియజేశాడు.
వాస్తవానికి, సందీప్ లామిచానేపై అత్యాచారం ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని కారణంగా నేపాల్ క్రికెట్ కూడా అతనిని నిషేధించింది. అయితే టీ20 ప్రపంచకప్నకు ముందు నేపాల్ కోర్టు ఈ కేసులో సందీప్ లామిచాన్ను నిర్దోషిగా ప్రకటించింది. కోర్టు నిర్దోషిగా విడుదలైన తర్వాత, సందీప్ లామిచానేపై నిషేధం ఎత్తివేసింది. టీ20 ప్రపంచ కప్ 2024 కోసం నేపాల్ జట్టులో కూడా చేర్చింది. అయితే సందీప్ లామిచాన్కి వీసా మంజూరు చేసేందుకు అమెరికా రాయబార కార్యాలయం నిరాకరించడంతో నేపాల్ జట్టులో చేరలేకపోయాడు.
ఇప్పుడు వెస్టిండీస్లో జరిగే చివరి రెండు మ్యాచ్ల కోసం తాను జట్టులో చేరనున్నట్లు సందీప్ లామిచానే చెప్పాడు. Xలో పోస్ట్ చేస్తూ, టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలోని చివరి రెండు మ్యాచ్ల కోసం వెస్టిండీస్లో నేపాల్ జట్టులో చేరుతున్నాను. నా కలను, క్రికెట్ ప్రేమికులందరి కలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తాను. నా వీసాకు సంబంధించి ఎలాంటి ప్రచారం జరిగినా నమ్మవద్దు. ఇదంతా నేపాల్ క్రికెట్ పరువు తీసేందుకు జరుగుతున్న కుట్ర. నేపాల్లో నా కోసం ప్రార్థించిన వారందరినీ నేను ప్రేమిస్తున్నాను. దీనికి నేను ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞుడను’ అంటూ చెప్పుకొచ్చాడు.
నేపాల్ క్రికెట్ జట్టు వెటరన్ ప్లేయర్ సందీప్ లామిచానే జనవరి 2024లో ఖాట్మండు జిల్లా కోర్టు 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కోర్టు అతనికి 8 సంవత్సరాల జైలు శిక్ష, 3 లక్షల నేపాలీ రూపాయల జరిమానా విధించింది. దీంతోపాటు బాధితురాలికి రూ.2 లక్షల నేపాలీ రూపాయిలు చెల్లించాలని స్పిన్ బౌలర్ను ఆదేశించింది. అయితే ఇప్పుడు ఈ కేసులన్నింటిలో నిర్దోషిగా విడుదలయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..