Gautam Gambhir: అతడికి అంత డబ్బు చెల్లించలేకే వదిలేసుకుంది.. చెన్నై జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన..

|

Jan 26, 2021 | 5:19 AM

Gautam Gambhir: వచ్చే నెలలో ఐపీఎల్‌ వేలం జరగనున్న సందర్భంగా ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెన్నై జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Gautam Gambhir: అతడికి అంత డబ్బు చెల్లించలేకే వదిలేసుకుంది.. చెన్నై జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసిన..
Follow us on

Gautam Gambhir: వచ్చే నెలలో ఐపీఎల్‌ వేలం జరగనున్న సందర్భంగా ఇండియన్ మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెన్నై జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేదార్‌ జాదవ్‌‌ను పక్కనపెట్టడానికి అతడి ఫామ్‌ మాత్రమే కారణం కాదని అతడికి రూ.7.8 కోట్లు చెల్లించలేకే వదిలేసిందని ఆరోపించాడు. అదే రూ.3 లేదా 4 కోట్లు అయితే రిటైన్డ్‌ చేసుకునేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటికే అయిదుగురు ఆటగాళ్లను చెన్నై జట్టు వదులుకున్న సంగతి తెలిసిందే.

కేదార్‌ ధర రూ.3-4 కోట్లు అయితే అతడిని ధోనీ మరో సీజన్‌ వరకు కొనసాగించేవాడని అన్నాడు. ధోనీ మరీ లోతుగా ఆలోచించడని, నిర్దిష్ట సీజన్‌ వరకు మాత్రమే ఆలోచిస్తాడని పేర్కొన్నాడు. పియూష్ చావ్లాకు అధిక ధర వెచ్చించాల్సి వస్తుందన్న కారణంతోనే విడిచిపెట్టిందని, కర్ణ్‌ శర్మ, ఇమ్రాన్ తాహిర్‌ను అంటిపెట్టుకుందని వ్యాఖ్యానించాడు. మరోవైపు బెంగుళూరు కూడా పది మంది ఆటగాళ్లను వదులుకుందని అన్నాడు. ఐపీఎల్‌లో సీఎస్‌కే విజయంతమవుతుండటానికి కారణం వాళ్ల ఆలోచనలేనని కొనియాడాడు. జట్టులో ఆడే 11 మంది ఆటగాళ్లతో పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండే అందరి ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తారని, సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్టుకు ఇదే తేడా అని చెప్పాడు.

కోహ్లీ, రోహిత్‌ మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది..!