Telangana Governor: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ఇవాల సాయంత్రం తిరుమలకు వెళ్లనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుమలకు వెళ్తున్న గవర్నర్.. ఆదివారం ఉదయం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆ సందర్భంగా మొక్కులు చెల్లించుకుంటారని రాజ్ భవన్ వర్గాల సమాచారం.
కాగా, గవర్నర్ తమిళిసై తిరుమలకు వస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. తిరుమలలోని ఆమె నివాసాన్ని సిద్ధం చేస్తున్నారు. అలా దర్శనానికి సంబంధించిన ఏర్పాట్లనూ ఆలయ అధికారులు పూర్తి చేశారు. కాగా, గవర్నర్ తమిళిసై కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని తెలుస్తోంది.
Also read: