కోవీషీల్డ్ వ్యాక్సిన్ పంపినందుకు ధన్యవాదాలు, ప్రధాని మోదీకి హనుమంతుని ఇమేజీ పంపిన బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్
కరోనా వైరస్ మహమ్మారితో సతమతమవుతున్న తమ దేశానికి కోవీషీల్డ్ వ్యాక్సిన్ పంపినందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు..
Covid Vaccine: కరోనా వైరస్ మహమ్మారితో సతమతమవుతున్న తమ దేశానికి కోవీషీల్డ్ వ్యాక్సిన్ పంపినందుకు బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సనారో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ధన్యవాద్ భారత్ అంటూ…. హనుమంతుడు సంజీవని (వ్యాక్సిన్) తీసుకువస్తున్న ఇమేజీని ఆయన తన ట్విటర్ లో షేర్ చేశారు. ‘నమస్కార్ ప్రైమ్ మినిష్టర్ మోదీజీ ! కోవిడ్ పై పోరులో మేం జరుపుతున్న పోరుకు మీరు కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు..ఇది మాకు గర్వ కారణం కూడా అని ఆయన పేర్కొన్నారు. ఇందుకు మోడీ ప్రతిస్పందిస్తూ.. కరోనావైరస్ మీద మనం కలిసికట్టుగా జరుపుతున్న పోరాటానికి తమ వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందన్నారు. ఆరోగ్య రంగంలో ఉభయ దేశాలూ సహకరించుకోవలసిందే అన్నారు.
శుక్రవారం ఇండియా నుంచి బ్రెజిల్ కి రెండు మిలియన్ల కోవీషీల్డ్ టీకామందు సరఫరా అయింది. అసలే ఆ దేశంలో కోవిడ్ ఇంకా కరాళనృత్యం చేస్తోంది. దీంతో తమకు అత్యవసరంగా కోవిడ్ వ్యాక్సిన్ కావాలని బ్రెజిల్..ఇండియాను కోరింది. గతంలో కూడా తమ దేశానికి హైడ్రాక్సీక్లోరోక్విన్ ని పంపినందుకు బ్రెజిల్ నేత జైర్ బొల్సనారో ఇండియాకు కృతజ్ఞతలు తెలిపారు.
The honour is ours, President @jairbolsonaro to be a trusted partner of Brazil in fighting the Covid-19 pandemic together. We will continue to strengthen our cooperation on healthcare. https://t.co/0iHTO05PoM
— Narendra Modi (@narendramodi) January 23, 2021
Also Read:
Rope Way: హైదరాబాద్లో రోప్ వే… డీపీఆర్లు సిద్ధం… ఏఏ మార్గాల్లో… ఎప్పుడు ప్రారంభిస్తారంటే..?