Prakasam District Road Accident: విషాదం.. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Prakasam District Road Accident: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్టూరు వద్ద జాతీయ రహదారిపై లారీని వెనుక ...

Prakasam District Road Accident: విషాదం.. ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Follow us

|

Updated on: Jan 07, 2021 | 4:12 AM

Prakasam District Road Accident: ప్రకాశం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్టూరు వద్ద జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు. తిరుమల నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read:

Road Accident: వివాహానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం.. నలుగురికి తీవ్ర గాయాలు

Trump Supporters Enter: అమెరికా క్యాపిటల్‌ భవనంలోకి చొచ్చుకెళ్లిన ట్రంప్‌ మద్దతు దారులు.. గన్‌తో కాల్పులు