ఆ నిర్ణయంతో చంద్రబాబులో వణుకు మొదలైంది: సుబ్రహ్మణ్య స్వామి

| Edited By:

Sep 22, 2020 | 10:04 AM

టీటీడీ నిధుల వినియోగంపై కాగ్‌ దర్యాప్తుకు అనుకూలంగా పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబులో వణుకు మొదలైందని

ఆ నిర్ణయంతో చంద్రబాబులో వణుకు మొదలైంది: సుబ్రహ్మణ్య స్వామి
Follow us on

Subrahmanian Swamy TTD: టీటీడీ నిధుల వినియోగంపై కాగ్‌ దర్యాప్తుకు అనుకూలంగా పాలక మండలి తీసుకున్న నిర్ణయంతో చంద్రబాబులో వణుకు మొదలైందని బీజేపీ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనాల్లో డిక్లరేషన్ అంశంపై బాబు అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అందులో భాగంగానే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్వామి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడూ ఏ మతస్తుడు అన్నది గుర్తించడం కష్టమని, భక్తుడు తనకు తాను చెబితే గానీ ఆ విషయం తెలీదని టీటీడీ ఛైర్మన్ మాట్లాడారని సుబ్రహ్మణ్య స్వామి వెల్లడించారు.

Read More:

ఐఐటీ, ఎన్ఐటీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఆ నిబంధన సడలింపు

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,166 కొత్త కేసులు.. 10 మరణాలు