గుంటూరులోని చారిత్రక శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి శతాబ్ది వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
ఈ ఉత్సవాల్లో మొదటి రోజున అమ్మవారిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు.
పవన్ కళ్యాణ్ కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్బంగా వేద పండితులు పవన్ కళ్యాణ్ కు అమ్మవారి తీర్థప్రసాదాలతోపాటు ఆశీర్వచనాలు అందచేశారు.
తమ ఆహ్వానాన్ని మన్నించి అమ్మవారి శతాబ్ది ఉత్సవ వేడుకలకు హాజరైన పవన్ కళ్యాణ్ ఆలయ కమిటీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.
ఐదు రోజుల పాటు జరగనున్న శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఈ రోజే అంకురార్పణ చేశారు.
పవన్ కళ్యాణ్ తో పాటు.. నేతలు, కార్యకర్తలు అమ్మవారిబు దర్శించుకున్నారు.
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఈ రోజే అంకురార్పణ
శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి శతాబ్ది ఉత్సవాలకు ఈ రోజే అంకురార్పణ