Nagarjuna Sagar: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. నియోజయవర్గంలోని పలు అభవృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. మరోవైపు, ఎగువ నుంచి భారీగా వరదనీరు ప్రాజెక్టులోకి ప్రవహిస్తుండటంతో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు ఈ సాయంత్రం ఎత్తారు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఎవరు నాగార్జునసాగర్ కి రావద్దని గురజాల ఆర్డీఓ జగన్నాథం పార్థసారథి ఆదేశాలు జారీచేశారు.
పల్నాడులో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ లో 144 సెక్షన్ విధించామని పార్థసారధి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ క్రస్ట్ గేట్లు తెరిచిన క్రమంలో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు విన్నవించారు.