Dharmendra Pradhan: విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల విలీనం పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ..

|

Sep 07, 2022 | 5:33 PM

జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల విలీనంపై కేంద్ర విద్యాఖశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. రాజస్థాన్ లోని కోటలో ఓ కార్యక్రమంలో..

Dharmendra Pradhan: విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల విలీనం పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ..
Dharmendra Pradhan
Follow us on

Dharmendra Pradhan: జాతీయ స్థాయి ప్రవేశపరీక్షల విలీనంపై కేంద్ర విద్యాఖశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. విద్యార్థలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన సూచించారు. రాజస్థాన్ లోని కోటలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE MAIN), నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) యూజీ, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) యూజీ 2022 వంటి జాతీయ స్థాయి ప్రవేశపరీక్షలను విలీనం చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి ఏమి లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీలోకే నీట్‌, జేఈఈ మెయిన్‌ను విలీనం చేయాలని యోచిస్తున్నట్లు యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్(UGC) ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తే మరింత సమర్థంగా ఆపరీక్షలు నిర్వహించడానికి వీలవుతుందనే ఉద్దేశంతో ఈ కొత్త విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నామని ఎం.జగదీశ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుందని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.

ఈ నిర్ణయంపై విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. ఎటువంటి చర్చలు లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కోరాయి. ఇలాంటి నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిరసన వ్యక్తం చేశాయి. ఈక్రమంలో ఈఅంశంపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ప్రస్తుతానికి విలీన ప్రతిపాదన ఏదీ లేదని, ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని కేంద్రమంత్రి సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..