Nithyananda bank currency: తమిళనాడులోని మధురై జిల్లాకు చెందిన వ్యాపారవేత్త సిటీ కుమార్ వినూత్న ప్రయత్నం చేశారు. వివాదాస్పద ఆధ్యాత్మిక వేత్త నిత్యానందకు చెందిన కైలాస దేశంలో తన హోటల్స్ని ప్రారంభించడానికి అనుమతి ఇవ్వాలని స్వామి నిత్యానందకు లేఖ రాశారు. నిత్యానంద అనుమతిస్తే కైలాస దేశంలో హెటళ్లను ప్రారంభించి భోజనం అందివ్వడమే కాకుండా దేశాభివృద్ధికి దోహదపడుతానని ఆయన లేఖలో వెల్లడించారు. కాగా టెంపుల్ సిటీ హోటల్స్ పేరుతో కుమార్ ఇప్పటికే 12 హోటళ్లను నడుపుతుండగా.. కైలాస దేశంలోనూ తన బ్రాంచ్లను ప్రారంభించాలని చూస్తున్నారు.
ఇదిలా ఉంటే రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాస పేరిట ఈ మధ్యన సొంత బ్యాంకును ప్రారంభించిన నిత్యానంద.. వినాయక చవితి సందర్భంగా శనివారం ఆ బ్యాంక్కు చెందిన బంగారు నాణేలను విడుదల చేశారు. దీంతో కైలాస దేశంలో వ్యాపారాలు చేయడానికి తమిళనాడుకు చెందిన పలువురు వ్యాపారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. కాగా ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో నిత్యానంద దేశం వదిలి పారిపోయిన విషయం తెలిసిందే.
Read More:
నా కుటుంబాన్ని కలవక రెండు నెలలు అవుతోంది: మంత్రి
చిరుకు మోహన్బాబు బర్త్డే గిఫ్ట్.. చూశారా!