ఇంటికి వెళ్లక రెండు నెలలు అవుతోంది: మంత్రి

కరోనా నేపథ్యంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. అందులో వైద్య సిబ్బందితో పాటు పోలీసులు

ఇంటికి వెళ్లక రెండు నెలలు అవుతోంది: మంత్రి
Follow us

| Edited By:

Updated on: Aug 23, 2020 | 5:28 PM

Health Minister KK Shailaja: కరోనా నేపథ్యంలో ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నారు. అందులో వైద్య సిబ్బందితో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వారే కాదు కొంతమంది ప్రజాప్రతినిథులు కూడా కరోనా నేపథ్యంలో తమ సేవలను కొనసాగిస్తూ.. అందరిలో ధైర్యాన్నినింపుతున్నారు. ఈ క్రమంలో కేరళ ఆరోగ్య మంత్రి కేకే శైలజ(63) కొన్ని కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ప్రారంభమైనప్పటి నుంచి అందరినీ అప్రమత్తం చేస్తూ పనిచేస్తున్న శైలజ, ఇంటికి వెళ్లక రెండు నెలలు అవుతోందట.

”అంతకుముందు ప్రతి శుక్రవారం తిరువనంతపురం నుంచి కన్నూర్‌(ఆమె కుటుంబం నివాసం ఉండే గ్రామం)కి వెళ్లి, ఆదివారం తిరిగి వచ్చేదాన్ని. కానీ గత రెండు నెలలుగా నేను వారిని కలవలేదు. నా భర్త, కుమారుడు, కోడలు, మనవరాలుతో వీడియో కాల్ మాట్లాడుతున్నా. వారంతా నా ఫోన్‌ కోసం చాలా ఎదురుచూస్తుంటారు” అని కేకే శైలజ అన్నారు. కాగా కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 55వేలను దాటేయగా.. 36వేల మందికి పైగా కోలుకున్నారు.

Read More:

చిరుకు మోహన్‌బాబు బర్త్‌డే గిఫ్ట్.. చూశారా!‌

‘బిగ్‌బాస్ 4’ ప్రారంభమయ్యేది ఎప్పుడంటే!