Minister Chases Bus: ఇటువైపు మంత్రి కాన్వాయ్.. అటువైపు ఆర్టీసీ బస్సు.. రోడ్డుపై ఛేజింగ్ సీన్.. చివరికి బస్సును ఛేజ్ చేసి తన కాన్వాయ్ని ఆ బస్సుకు అడ్డంగా పెట్టిన మంత్రి.. ఈ సీన్ అంతా చూసిన జనాలు ఏం జరిగిందో అని కంగారు.. ఇదంతా కర్ణాటకలో చోటు చేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు జిల్లా మధుగిరిలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎస్ సురేష్ కుమార్ పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన రోడ్డుపై వెళ్తుండగా, కొందరు విద్యార్థులు బస్సు కోసం వేచి ఉన్నారు. అదే సమయంలో కేఎస్ఆర్టీసీ బస్సు వచ్చింది. అయితే ఆ బస్సు విద్యార్థుల కోసం ఆగకుండా అలాగే వెళ్లిపోయింది. ఇది గమనించిన మంత్రి సురేష్.. సదరు బస్సును ఛేజ్ చేశారు. బస్సుకు అడ్డంగా తన కాన్వాయ్ని నిలిపారు.
అయితే, ఒక్కసారిగా బస్సు ముందు కాన్వాయ్ ఆగడంతో బస్సు డ్రైవర్తో పాటు, అందులోని ప్రయాణికులూ కంగారుపడ్డారు. అయితే, మంత్రి సురేష్ బస్సు డ్రైవర్, కండక్టర్ను కిందకు దించి.. విద్యార్థులకు బస్సును ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. వారిని వివరణ కోరారు. అంతేకాదు.. ఇకపై ఎప్పుడైనా, ఎక్కడైనా విద్యార్థులు బస్సు కోసం వేచి ఉంటే ఆపి తీరాల్సిందే అని తీవ్ర స్వరంతో వార్నింగ్ ఇచ్చారు. కాగా, ఈ ఘటనపై కేఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని సంస్థ అధికారులు ప్రకటించారు.
Also read:
Bitcoin Price : రాకెట్లా దూసుకుపోతున్న బిట్ కాయిన్.. 1.46 లక్షల డాలర్లకు చేరుకునే ఛాన్స్..
Landslides In Indonesia: ఇండోనేషియాలో భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు.. 12 మంది మృతి