Jacqueline Fernandez: మరోసారి చిక్కుల్లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. ఆ ఫోటోతో రచ్చ షురూ

|

Nov 27, 2021 | 10:07 AM

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న జాక్వెలిన్‌ చుట్టూ మరో వివాదం ముసిరింది.

Jacqueline Fernandez: మరోసారి చిక్కుల్లో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌.. ఆ ఫోటోతో రచ్చ షురూ
Jacqueline Fernandez
Follow us on

బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు. సుకేష్‌ చంద్రశేఖర్‌తో ఉన్న ఫొటో ఒకటి బయటికొచ్చింది. ఇప్పటికే మనీలాండరింగ్‌ కేసులో ఈడీ విచారణ ఎదుర్కొన్న జాక్వెలిన్‌.. సుకేష్‌తో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఐతే తాజాగా 200కోట్ల రూపాయల దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జాక్వెలిన్‌తో ఫొటో బయటకు రావడంతో.. ఆమె మళ్లీ చిక్కుల్లో పడ్డట్టే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. సుకేష్‌ చంద్రశేఖర్‌పై 200కోట్ల కుంభకోణం ఆరోపణలు ఉన్నాయి. ప్రముఖ బిజినెస్‌ మెన్‌ శివేందర్‌ సింగ్‌ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ సుకేష్‌తో జాక్వెలిన్ ఫొటో బయటకు రావడం హాట్‌ టాపిక్‌గా మారింది. సుకేష్ చంద్రశేఖర్ మధ్యంతర బెయిల్ పైన విడుదలయిన సమయంలో ఏప్రిల్ – జూన్ కాలంలో ఈ ఫొటో తీసినట్లుగా చెబుతున్నారు.

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను సుకేష్ చంద్రశేఖర్ చెన్నైలో దాదాపు నాలుగు సార్లు కలిశారని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. అతడిని కలిసేందుకు  జాక్వెలిన్ ప్రైవేట్ జెట్‌ను కూడా ఏర్పాటు చేశారని ఈడీ అధికారులు చెబుతున్నారు. కొద్ది నెలల క్రితం మనీ లాండరింగ్ కేసులో జాక్వలిన్‌కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. అయితే, మూడు సార్లు విచారణకు హాజరు కాని జాక్వలిన్‌ ఆ తరువాత హాజరయ్యారు. సుఖేష్‌ చంద్రశేఖర్‌, ఆయన భార్య లీనా పౌల్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే బాలీవుడ్ నటి నోరాఫతేహి, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఈడీ  నోటీసులు పంపింది. సుకేష్ చంద్రశేఖర్ సహా మరో 13 మంది రూ. 200 కోట్ల మేర మోసం చేశారని అభియోగాలు నమోదయ్యాయి.

Also Read: మళ్లీ డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోన్నరాయలచెరువు.. వరుస లీకేజీలు

కృష్ణా జిల్లాలో మోహన్ బాబు పర్యటన.. సీఎం జగన్‌ను కలిసే అవకాశం