Covid 4th Wave: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 20 వేలకు పైగానే కేసులు.. మరణాలు ఎన్నంటే..?

|

Jul 15, 2022 | 10:16 AM

కరోనా మహమ్మారి కారణంగా 47 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Covid 4th Wave: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. 20 వేలకు పైగానే కేసులు.. మరణాలు ఎన్నంటే..?
India Corona Update
Follow us on

India Covid-19 Updates: దేశంలో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. గత 24 గంటల్లో కూడా కరోనా కేసుల సంఖ్య 20 వేల మార్క్‌ దాటింది. కానీ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గురువారం దేశవ్యాప్తంగా 20,038 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 47 మంది మరణించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో1,39,073 (0.31 శాతం) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 4.44 శాతం పెరగగా.. రికవరీ రేటు 98.49 శాతం ఉంది.

  • దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,37,10,027 కి పెరిగింది.
  • కరోనా నాటి నుంచి దేశంలో మరణాల సంఖ్య 5,25,604 కి చేరింది.
  • నిన్న కరోనా నుంచి 16,994 మంది కోలుకున్నారు.
  • కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,30,45,350 కి చేరింది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 199.47 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు. నిన్న 18,92,969 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. కాగా.. శుక్రవారం నుంచి 18 సంవత్సరాలు దాటిన అందరికీ.. ఉచితంగా బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేసింది.

నిన్న కేరళలో అత్యధికంగా 3,237 కేసులు నమోదు కాగా.. పశ్చిమ బెంగాల్‌లో 3,029, తమిళనాడులో 2,283, మహారాష్ట్రలో 2,229, కర్ణాటకలో 1209 కేసులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

జాతీయ వార్తల కోసం..