India Covid-19 Updates: భారత్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి 20 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్ (Coronavirus) అనంతరం భారీగా తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన నెలకొంది. కాగా.. గత 24 గంటల్లో శనివారం దేశవ్యాప్తంగా 20,528 కేసులు నమోదయ్యాయి. శుక్రవారంతో పోల్చుకుంటే 484 కేసులు పెరిగాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో 1,43,449 (0.33 శాతం) కేసులు యాక్టివ్గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 5.23 శాతం పెరగగా.. రికవరీ రేటు 98.47 శాతంగా ఉంది.
కాగా.. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. నిన్న 25,59,840 మందికి టీకాలు వేయగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన కోవిడ్ డోసుల సంఖ్య 1,99,98,89,097 కు చేరింది. ఆదివారంతో వ్యాక్సినేషన్ మరో ఘనతను సాధించనుంది. డోసుల సంఖ్య 200 కోట్ల మార్క్ దాటనుంది.
COVID19 | India records 20,528 new cases & 49 deaths in the last 24 hours; Active caseload at 1,43,449
199.98 cr total vaccine doses administered so far under the nationwide vaccination drive. pic.twitter.com/gHFyDoOGAd
— ANI (@ANI) July 17, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..