కరోనా ఆ ఎమ్మెల్యేను ఓటు వేయడం నుంచి ఆపలేదు. పీపీఈ కిట్ ధరించి వచ్చి మరీ తన ఓటును వినియోగించుకున్నారు ఆ ఎమ్మెల్యే. రాజ్యసభ స్థానాలకు గానూ ఈ రోజు జరిగిన ఎన్నికల్లో భోపాల్కి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కునాల్ చౌదరి ఓటేసి వెళ్లారు. మధ్యాహ్నం గం.12.45ని.లకు అంబులెన్స్లో విధానసభకు చేరుకున్న కునాల్ తన ఓటును వినియోగించుకున్నారు. ఆ లోపే మిగిలిన ఎమ్మెల్యేలు ఓటేయగా.. కునాల్ చివర్లో ఓటేసి వచ్చారు.
ఈ సందర్భంగా కునాల్ మాట్లాడుతూ.. ”నా దగ్గరికి మిగిలిన సభ్యులు ఎవ్వరూ రాలేదు. వాళ్లు భయపడటం సహజమే. కానీ నేను పూర్తి జాగ్రత్తలు పాటించి మా పార్టీ అభ్యర్థికి ఓటు వేసి వచ్చాను” అని అన్నారు. కాగా కరోనా సోకిన పలువురు ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలకు దూరంగా ఉండగా.. కునాల్ మాత్రం తన ఓటును వినియోగించుకోవడం గమనర్హం. ఈ క్రమంలో ఆయనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. బాధ్యతాయుతంగా కునాల్ తన ఓటును వినియోగించుకున్నారంటూ కాంగ్రెస్ చెప్పుకొస్తుండగా.. కరోనా సోకిన ఓ వ్యక్తికి ఓటు వేసేందుకు ఎలా అనుమతిని ఇచ్చారంటూ బీజేపీ వాదిస్తోంది. కాగా ఈ నెల 12న కునాల్కి కరోనా సోకినట్లు నిర్దారణ అయ్యింది.
Read This Story Also: నిరుద్యోగులకు ఐబీఎమ్ సంస్థ గుడ్న్యూస్