కాశ్మీర్ వెళ్లాలంటే భయపడ్డాను.. దుమారం రేపుతున్న మాజీ హోంమంత్రి వ్యాఖ్యలు..!

|

Sep 10, 2024 | 5:28 PM

జమ్మూ కశ్మీర్‌లో టూరిజం జోరుగా సాగుతోంది. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఒకప్పుడు పాకిస్థాన్‌, ఐఎస్‌ఐఎస్‌ జెండాలు కనిపించేవి. కానీ ప్రస్తుతం త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. భూతల స్వర్గంగా భావించే కాశ్మీర్ అందాలను నిర్భయంగా ఆస్వాదిస్తున్నారు.

కాశ్మీర్ వెళ్లాలంటే భయపడ్డాను.. దుమారం రేపుతున్న మాజీ హోంమంత్రి వ్యాఖ్యలు..!
Shinde And Kharge
Follow us on

జమ్మూ కశ్మీర్‌లో టూరిజం జోరుగా సాగుతోంది. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఒకప్పుడు పాకిస్థాన్‌, ఐఎస్‌ఐఎస్‌ జెండాలు కనిపించేవి. కానీ ప్రస్తుతం త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. భూతల స్వర్గంగా భావించే కాశ్మీర్ అందాలను నిర్భయంగా ఆస్వాదిస్తున్నారు. అయితే, ఒకప్పుడు లాల్ చౌక్ అంటే భయపడే వాళ్ళమని మాజీ కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో హోంమంత్రిగా ఉన్న సుశీల్ కుమార్ షిండే స్వయంగా ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు. శ్రీనగర్‌కు వెళ్లి మరీ పబ్లిసిటీ తెచ్చుకున్న ఆయన నిజానికి కాశ్మీరీలు నలిగిపోయారన్నారు. సుశీల్ కుమార్ షిండే రచించిన ‘ఐదు దశాబ్దాల రాజకీయం’ పుస్తకాన్ని విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు.

షిండే సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రెండుసార్లు ఎంపీగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, ప్రముఖ విద్యావేత్త విజయ్‌ధర్ వంటి రాజకీయ ప్రముఖులు కూడా ఉండటం విశేషం. తన పుస్తకంలో పేర్కొన్న అంశాల్లో ఒకదాన్ని ప్రస్తావిస్తూ, కాశ్మీర్‌లో తాను భయపడ్డాన్నానని షిండే అన్నారు. విద్యావేత్త విజయ్‌ధర్ సుశీల్ షిండేకు అత్యంత సన్నిహితుడు.

ఈ సందర్భంగా విజయ్ ధర్‌ గురించి ప్రస్తావిస్తూ. “ఇంతకుముందు హోంమంత్రిగా ఉన్నప్పుడు, విజయ్ ధర్ వద్దకు వెళ్లి సలహా అడిగేవాడిని, అయితే అక్కడా ఇక్కడా తిరుగొద్దు అని సలహా ఇచ్చాడన్నారు. కాశ్మీర్‌లోని లాల్ చౌక్‌కి వెళ్లి అక్కడ ప్రసంగం చేసి, కొంతమందిని కలిసి దాల్ సరస్సులో తిరిగాలని ధర్ సలహా ఇచ్చారు. ఆ సలహాతో చాలా ప్రచారం వచ్చింది. ఎలాంటి భయం లేకుండా వెళ్లే హోం మినిస్టర్ ఉన్నారని జనాల్లో నమ్మకం కుదిరింది. కానీ ఎవరికి చెప్పుకోలేని భయం లోలోపల ఉండేది” అని మాజీ హోంమంత్రి సుశీల్ షిండే కీలక వ్యాఖ్యలు చేశారు. షిండే ఇలా చెప్పడంతో వేదిక ఒక్కసారిగా నవ్వులతో మారుమోగింది. దీంతో కాంగ్రెస్‌ నేత ‘నిజమే.. కానీ మిమ్మల్ని నవ్వించడానికే అన్నాను కానీ ఓ మాజీ పోలీసు ఇలా అనలేదు’ అని అన్నారు. విజయ్ ధర్ సుశీల్ కుమార్ షిండే సన్నిహితులలో ఒకరు. ఆయన అభ్యర్థన మేరకు షిండే కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని పాఠశాలను సందర్శించారు. ఆ స్కూల్ హెడ్ కూడా విజయ్ ధరే.

యూపీఏ ప్రభుత్వ హయాంలో జమ్మూ కాశ్మీర్‌లో భయాందోళనలు నెలకొని ఉన్నాయని షిండే చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. భారతీయ జనతా పార్టీ ఆర్టికల్ 370 రద్దుతోనే అది సాధ్యమైందంటూ చెప్పుకొచ్చింది. లోయ పరిస్థితి ఎలా ఉందో షిండే ప్రకటన రుజువు అని పేర్కొంది. దీని కారణంగా పర్యాటకులు జమ్మూ, కాశ్మీర్ చుట్టూ ఎటువంటి భయం లేకుండా తిరుగుతున్నారని పేర్కొంది. షిండే మాటలను కాంగ్రెస్ పట్టించుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, వేర్పాటువాదం వెన్ను విరిగిపోయింది. ఎర్రకోట నుండి లాల్ చౌక్ వరకు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. తీవ్రవాదం, రాళ్ల దాడి పరిస్థితులు మారిపోయాయి. బుల్లెట్లు కాల్చే చోట క్రికెట్ జరుగుతుందని ఆయన అన్నారు.

సుశీల్ కుమార్ షిండే ప్రకటన తర్వాత అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు కాశ్మీర్ మారిందని సుశీల్ కుమార్ షిండే అంగీకరించారా, కాశ్మీర్ ఇప్పుడు సురక్షితంగా ఉందని షిండే అంగీకరించారా, 370ని తొలగించడాన్ని కాంగ్రెస్ నాయకుడు సైగలలో ప్రశంసించారా, కాశ్మీర్‌పై మోదీ ప్రభుత్వ విధానాన్ని షిండే ఆమోదించారా, లోయ బాగుందని షిండే అభివర్ణించారా? కాంగ్రెస్ ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితి ఆగిపోయిందా? అన్నదీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలావుంటే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత, కాశ్మీర్‌లో రాళ్లదాడి నుండి ఉగ్రవాదుల నిర్మూలన వరకు చర్యలు తీసుకున్నారు. 2015 నుండి 2019 వరకు 5,063 రాళ్లదాడి సంఘటనలు నమోదయ్యాయి. అయితే 2019-2023 మధ్య 434 సంఘటనలు మాత్రమే నమోదయ్యాయి. అదే సమయంలో, 2015-2019 మధ్య 740 మంది ఉగ్రవాదులు మరణించగా, 2019-2023 మధ్య 675 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా సిబ్బంది ప్రాణనష్టం గురించి మాట్లాడితే, 2015-2019 మధ్య 379 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. 2019-2023 వరకు 146 మంది సైనికులు మాత్రమే అమరులయ్యారు. మోదీ హయాంలో కాశ్మీర్ లోయ పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి చేరుకుంటోందని భారతీయ జనతా పార్టీ నేతలు చెబుతున్న మాట.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..