Chhattisgarh Encounter:ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా తర్రెమ్ అడవుల్లో పోలీసులకు, మావోయిస్టులకు ఎదురు కాల్పుల్లో జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఇద్దరు మావోయిస్టులకు గాయాలయ్యాయి. ఘటన ప్రదేశంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
కాగా, మావోయిస్టులకు అడ్డాగా మారిన ఛత్తీస్గఢ్లో ప్రతి రోజు ఏదో ఒక ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో మావోల కదలికలు అధికంగా ఉండటంతో ప్రత్యేక పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో ఎన్కౌంటర్లు చోటు చేసుకోగా, మావోయిస్టు నేతలు హతం అయిన ఘటనలున్నాయి. మావోయిస్టులను ఏరివేతలో భాగంగా ప్రతినిత్యం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నా.. ఇంకా మావోల కదలికలు ఉంటూనే ఉన్నాయి.
Also Read: Corona Vaccine: రెండు రోజుల విరామం తర్వాత ముంబై, పుణెలలో ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ