కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తెలంగాణలో జోరుగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రలో రాహుల్ గాంధీ కార్యకర్తలో మమేకమవుతూ.. వారు చెప్పే సమస్యలను కూడా వింటున్నారు. అంతేకాకుండా ఈ యాత్రలో పలువురు ప్రముఖులు, నేతలతో కూడా సంభాషిస్తున్నారు. అయితే.. తెలంగాణలో శనివారం జరిగిన భారత్ జోడో యాత్రలో నటి పూనమ్ కౌర్.. రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ తో కలిసి నడుస్తూ.. పూనమ్ చేనేత కార్మికుల సమస్యలను రాహుల్ గాంధీకి వివరించారు. కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జిఎస్టీ ఎత్తి వేయాలని, చేనేత వస్తువులపై పన్నులు తొలగించాలని, గ్యాస్ ధరలు తగ్గించాలని కోరారు. రాహుల్ గాంధీతో 15 నిమిషాల్లో మాట్లాడానని.. ఆయన అన్ని విషయాలను విన్నారన్నారు. మహిళల పట్ల గౌరవంతో వ్యవహరిస్తూ ప్రతి విషయాన్ని ఎంతో అధ్యయనం చేస్తున్నారని పూనమ్ తెలిపారు. చేనేత కార్మికుల సమస్యల గురించి త్వరలోనే సోనియాను, ప్రియాంకా గాంధీని కలవాలని రాహుల్ కోరినట్లు ఆమె వివరించారు. కాగా.. పూనమ్ కౌర్.. రాహుల్ గాంధీతో కలిసి నడుస్తున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిలో రాహుల్.. పూనమ్ చేయి పట్టుకొని నడుస్తున్నారు. దీనిపై బీజేపీ నేతలతోపాటు.. పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తంచేస్తున్నారు. బీజేపీ నేతలు రాహుల్, పూనమ్ ను కించపరుస్తూ.. అవమానకరంగా ట్వీట్లు చేస్తున్నారు.
దీనిపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మహారాష్ట్ర నాయకురాలు ప్రీతీ గాంధీ.. రాహుల్, పూనమ్ కలిసి నడుస్తున్న ఫొటోను షేర్ చేసి.. కించపరిచేలా విమర్శలు చేశారు. రాహుల్- పూనమ్ చిత్రాన్ని పంచుకున్న ఆమె.. తన ముత్తాత అడుగుజాడల్లో నడుస్తున్నారు.. అంటూ రాశారు. ఈ ఫోటో వైరల్గా మారడంతో సోషల్ మీడియా యూజర్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Following the footsteps of his great grand father!!? pic.twitter.com/iAFMrOyg6w
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) October 29, 2022
కాగా. ప్రీతి గాంధీ చేసిన ట్విట్ పై నటి పూనమ్ కౌర్ స్పందించారు. “ఇది మిమ్మల్ని మీరే కించపరుచుకున్నట్లు ఉంది.. ప్రధాని మోడీ నారిశక్తి గురించి మాట్లాడారని గుర్తుంచుకోండి.. నేను బ్యాలెన్స్ తప్పి పోయి కిందపడుతున్నప్పుడు.. ఆయన నా చెయ్యి పట్టుకున్నారు” అంటూ ప్రీతి గాంధీ ట్వీట్కు సమాధానంగా పూనమ్ కౌర్ రీట్వీట్ చేశారు.
This is absolutely demeaning of you , remember prime minister spoke about #narishakti – I almost slipped and toppled that’s how sir held my hand . https://t.co/keIyMEeqr6
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) October 29, 2022
కాగా.. ప్రతీ గాంధీ ట్విట్ పై కాంగ్రెస్ నేతలతోపాటు.. పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. నట్టాశశర్మ దీనిపై ట్విట్ చస్తూ.. ఓ మహిళగా ఉండి ఇంతలా ఎలా దిగజారిపోతారు.. ఈ రోజు వరకు ఇలాంటి వారిని చూడలేదు.. నీకు సిగ్గు లేదా అమ్మేశావా…? అంటూ ఘాటుగా విమర్శలు చేశారు.
तुम औरत हो कर इतना कैसे गिर जाती हो..,तुमसे जायदा नीच, गिरा हुआ मैंने तो आज तक नहीं देखा…कुछ तो शर्म करो तुम,या बेच खाई है…? https://t.co/nVwLL2bCIT
— Nattasha Sharrma नत्ताशा शर्मा?? (@Nattashasharrma) October 29, 2022
దీనిపై శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా స్పందించి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ కూడా ప్రీతి గాంధీ ట్విట్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘వికృతమైన – జబ్బుపడిన మనస్సు’ అంటూ వ్యాఖ్యానించారు.
If you mean, it leads to women walking shoulder to shoulder with men&hand in hand to strengthen&take the nation forward, then not just Pandit Nehru’s vision of India but also Babasaheb Ambedkar’s & the freedom fighters’ dream of equal India will be realised.
Sit down please. pic.twitter.com/42qLmSnMes— Priyanka Chaturvedi?? (@priyankac19) October 29, 2022
రాహుల్ గాంధీ నిజంగా తన తాత అడుగుజాడల్లో నడుస్తున్నారని, దేశాన్ని ఏకం చేస్తున్నారని పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాతేతోపాటు.. పలువురు అభిప్రాయపడుతూ.. ప్రీతి గాంధీ ట్విట్ పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Whether it is left or elderly or women, everyone is joining step by step with Shri @RahulGandhi ji to join the India Jodo Yatra.#BharatJodoYatra pic.twitter.com/o6KZnqPJg5
— South 24 Parganas Congress Sevadal (@SevadalS24) October 29, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం..