Schools Reopen: కరోనా మహమ్మారి విద్యార్థులకు సుదీర్ఘకాలం పాటు పాఠశాలను దూరం చేసింది. దాదాపుగా 16 నెలలు మూతబడిన తరువాత, ఇప్పుడు దేశంలోని చాలా రాష్ట్రాలలో పాఠశాలలు తెరుచుకున్నాయి. కొన్ని చోట్ల తెరుచుకోబోతున్నాయి. చాలా రాష్ట్రాలు సీనియర్ తరగతులను ముందుగా తెరవాలని, తర్వాత చిన్న తరగతులను తెరవాలని నిర్ణయించాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించడం కూడా తప్పనిసరి చేశారు.
అయితే, మీడియా కథనాల ప్రకారం, గత రెండు వారాల్లో, దేశవ్యాప్తంగా 600 మందికి పైగా పిల్లలు కోవిడ్ -19 బారిన పడ్డారు. గత వారంలోనే పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్లో 100 మందికి పైగా పిల్లలు సోకినట్లు గుర్తించారు. ఇంతకుముందు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్తో సహా ఇతర రాష్ట్రాలలో పిల్లలు వ్యాధి బారిన పడినట్లు నివేదికలు వచ్చాయి. హిమాచల్ ప్రదేశ్లో ఆగస్టు 22 వరకు పాఠశాలలు మూసివేశారు. ప్రతిరోజూ 10,000 మంది విద్యార్థులకు RT-PCR పరీక్షను నిర్వహించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వార్తల నేపథ్యంలో.. కరోనా భయం లేదా చదువులో నష్టం వాటిల్లుతుందా అనే గందరగోళం తల్లిదండ్రులను వెంటాడుతోంది. పిల్లలను పాఠశాలకు పంపితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. వారిని పంపకపోతే విద్యను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది పెద్ద చిక్కుముడిలా తయారు అయింది. తల్లిదండ్రులకు విపరీతమైన టెన్షన్ పెడుతున్న అంశంగా మారింది. ఈ క్రమంలో దేశంలో ఎక్కడెక్కడ పాఠశాలలు తెరిచారు? విద్యార్థులు కరోనా బారిన పడిన కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయి? ప్రస్తుతం పిల్లలను స్కూల్స్ కు పంపించడం సురక్షితమేనా? ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారు? వంటి విషయాలను తెలుసుకుందాం.
దేశంలో పాఠశాలలు ఎక్కడ ప్రారంభం అయ్యాయి?
దేశంలోని సగం రాష్ట్రాలలో పాఠశాలలు తెరవబడ్డాయి. చాలా రాష్ట్రాలలో, కోవిడ్ ప్రోటోకాల్ను అనుసరించి 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ఉన్న విద్యార్థులను మాత్రమే పాఠశాలకు అనుమతి ఇస్తున్నారు. పంజాబ్లోనే అన్ని తరగతులకు పాఠశాలలు తెరిచారు. సెప్టెంబర్ 1 నుండి తెలంగాణ, అస్సాం, రాజస్థాన్, తమిళనాడుల్లో కూడా పాఠశాలలు తెరుచుకోనున్నాయి.
ఏ రాష్ట్రాలు ఎప్పుడు..ఎలా పాఠశాలలను తెరిచాయి?
రాజస్థాన్: సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లను తెరవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు 9 నుండి 12 వ తరగతి వరకు 50% సామర్థ్యంతో ఆఫ్లైన్ తరగతులను ప్రారంభించవచ్చు. 1 నుంచి 8 తరగతుల పిల్లలకు ఆన్లైన్ తరగతులు కొనసాగుతాయి. ఈ సమయంలో ఆన్లైన్ అధ్యయనాలు కూడా కొనసాగుతాయి. కరోనా సోకినట్లు తేలితే తరగతులు 10 రోజులు మూసివేయాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్: 9, 10 తరగతుల విద్యార్థుల కోసం ఆగస్టు 5 నుంచి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను ప్రారంభించింది. ప్రస్తుతం, పిల్లలు వారానికి 2 రోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లాల్సి ఉంటుంది. జూలై 26 నుండి 11, 12 వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు తెరిచారు. ఇక్కడ 11 వ, 12 వ విద్యార్థులను 2 బ్యాచ్లుగా విభజించడం ద్వారా, ప్రతి బ్యాచ్ను రోజు విడిచి రోజు పాఠశాలకు హాజరు అయ్యేలా ఏర్పాటు చేశారు.
గుజరాత్: జూలై 15 నుండి రాష్ట్రంలో 12 వ తరగతి విద్యార్థులకు ఆఫ్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. జూలై 26 నుండి 9 నుండి 11 తరగతుల విద్యార్థులకు కూడా పాఠశాలలు తెరిచారు. ప్రస్తుతం, 50% మంది విద్యార్థులు మాత్రమే ఆఫ్లైన్ తరగతులకు హాజరు అయ్యే అవకాశం ఉంది. కళాశాలలు, సాంకేతిక సంస్థలు కూడా 50% సామర్థ్యంతో ప్రారంభమయ్యాయి.
మహారాష్ట్ర: రాష్ట్రంలో ఆగస్టు 17వ తేదీ నుంచి 5 -12 తరగతులకు పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిపుణుల కమిటీ సలహా తర్వాత నిర్ణయం వాయిదా పడింది. జూలై 15 నుండి మహారాష్ట్రలో 8 నుండి 12 వ తరగతి వరకు సుమారు 5,900 పాఠశాలల్లో ఆఫ్లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ పాఠశాలలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ కొత్త కరోనా కేసులు లేవు.
హర్యానా: ముందుగా దేశంలో హర్యానాలో అన్ని తరగతులకూ పాఠశాలలు ప్రారంభించారు. జూలై 16 నుండి హర్యానాలో 9 – 12 వరకు పాఠశాలలు తెరుచుకున్నాయి. 5 వ తరగతి వరకు పాఠశాలలు తెరవడానికి నివేదిక తయారు చేయాలని ప్రభుత్వం అధికారులను కోరింది. ఈ నివేదిక ఆధారంగా, మిగిలిన తరగతులను తెరవడానికి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
పంజాబ్: జూలై 26 నుండి , పంజాబ్లో 10 – 12 వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు తెరుచుకున్నాయి. ఆగస్టు 2 నుండి, ప్రభుత్వం విద్యార్థులందరికీ ఆఫ్లైన్ తరగతులను ప్రారంభించింది. ఈ పరిధిని విస్తరిస్తోంది. పిల్లలు పాఠశాలకు రావడానికి తల్లిదండ్రుల సమ్మతి అవసరం. పాఠశాలకు రాని పిల్లలకు ఆన్లైన్ తరగతులు కూడా కొనసాగుతాయి.
హిమాచల్ ప్రదేశ్: రాష్ట్రంలో ఆగస్టు 2వ తేదీ నుంచి 9-12 తరగతుల వరకు పాఠశాలలు తెరిచారు. కరోనా కేసులు పెరగడం ప్రారంభం కావడంతో పాఠశాలలు ఆగస్టు 22 వరకు మళ్లీ మూసివేశారు. ఆగస్టు 22 తర్వాత, ఏ పిల్లలు ఎప్పుడు పాఠశాలకు రావాలనేది నిర్ణయించనున్నారు.
బీహార్: రాష్ట్రంలో ఆగస్టు 16 నుండి.. 1 వ తరగతి నుండి 8 వ తరగతి వరకు 50% సామర్థ్యంతో స్కూల్స్ ప్రారంభించారు. 9 నుండి 12 వ తరగతులకు కూడా ఆగస్టు 7 నుండి ఆఫ్లైన్లో నడుస్తున్నాయి. సామాజిక దూరం పాటిస్తున్నారు. పిల్లలు ఇంట్లో తయారు చేసిన లంచ్ బాక్స్ మాత్రమే తీసుకురావాలి. బస్సులలో ఏసీలు నిలిపివేశారు. అదేవిధంగా వెంటిలేషన్ కోసం విండోస్ తెరిచి ఉంచేలా ఏర్పాటు చేశారు. ఇక రోజుకు రెండుసార్లు బస్సుల శానిటైజేషన్ ఉంటుంది.
ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలో ఆగస్టు 16 నుంచి 9- 12 తరగతుల వరకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. 6 నుండి 8 వరకు, 1 నుండి 5 తరగతులు ఆగష్టు 23 నుండి తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న విద్యార్థులకు టీకాలు వేయాలని కోరారు. టీకాల శిబిరాలు పాఠశాలల్లో కూడా ఏర్పాటు చేయనున్నారు.
ఢిల్లీ: బోర్డ్ పరీక్షల కోసం కౌన్సెలింగ్, ప్రాక్టికల్స్ కోసం పాఠశాలలకు 10, 12 వ తరగతి విద్యార్థులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతించింది. అయితే, తల్లిదండ్రుల వ్రాతపూర్వక సమ్మతి అవసరం. విద్యార్థులు పుస్తకాలు, స్టేషనరీలను ఎవరితోనూ పంచుకోకూడదు. దీనితో పాటు, పాఠశాలల్లో శానిటైజేషన్, థర్మల్ స్కానింగ్ చేయడం కూడా అవసరం.
ఛత్తీస్గఢ్ : రాష్ట్రంలో ఆగస్టు 2 నుండి 10, 12 వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు తెరుచుకున్నాయి. ప్రస్తుతం 50% సామర్థ్యంతో మాత్రమే పాఠశాలలు తెరిచి ఉన్నాయి. సగం మంది విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు రావాల్సి ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్: ఆగస్టు 16నుంచి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ పాఠశాలలు అదేవిధంగా జూనియర్ కాలేజీలు తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరిగా ప్రభుత్వం పేర్కొంది.
ఇతర రాష్ట్రాల పరిస్థితి ఏమిటి?
పిల్లలను పాఠశాలకు పంపడం సురక్షితమేనా?
పాఠశాలలు, కళాశాలల్లో వేడి, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ (HVAC) వ్యవస్థలు సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించవచ్చని యూఎస్ లోని మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) ఒక అధ్యయనంలో నివేదించింది. తరగతి గదిలో వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్పై శ్రద్ధ వహిస్తే, గాలిలో ఉండే ఏరోసోల్లో వైరస్లు ఎక్కువ కాలం జీవించలేవు. ఈ ఏరోసోల్స్ సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి. తరగతి గదిలో మంచి వెంటిలేషన్ ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
కోవిడ్ -19 బారిన పడిన పిల్లలు 6 రోజుల్లో కోలుకుంటారని ది లాన్సెట్ చైల్డ్, కౌమార ఆరోగ్య జర్నల్లో ఆగస్టు 4 న ప్రచురించిన ఒక నివేదిక పేర్కొంది. వారికి సుదీర్ఘ కోవిడ్ వచ్చే ప్రమాదం కూడా చాలా తక్కువ. 20 మందిలో 1 శిశువుకు మాత్రమే 4 వారాలకు పైగా లక్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే పిల్లలు 8 రోజుల్లో పూర్తిగా కోలుకుంటారు. 5 నుంచి 17 సంవత్సరాల మధ్య వయసున్న 2.5 లక్షల మంది పిల్లలపై ఈ అధ్యయనం జరిగింది.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. మూడవ వేవ్ పిల్లలకు ప్రమాదకరంగా ఉంటుందని శాస్త్రీయ ఆధారం లేదు. మొదటి, రెండవ వేవ్లలో కూడా, పిల్లలు తక్కువ సంక్రమణకు గురయ్యారు. మొత్తం తీవ్రమైన రోగులలో 10 నుండి 11% మాత్రమే 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఉండటం గమనార్హం.
కరోనా వైరస్ ఊపిరితిత్తులలో ఉండే ACE-2 అనే గ్రాహకాలకు బంధిస్తుంది. పిల్లలలో ఈ గ్రాహకాలు తక్కువగా అభివృద్ధి చేయబడ్డాయి. ఈ కారణంగా, పిల్లలలో సంక్రమణ తర్వాత కూడా, తీవ్రమైన లక్షణాలు కనిపించవు.
మూడవ లేదా నాల్గవ వేవ్ ఉన్న దేశాలలో కూడా, పిల్లలు పెద్దగా ప్రభావితం కాలేదు. కొత్త వేరియంట్లు కూడా పిల్లలను పెద్దగా ప్రభావితం చేయవు. అంటే, పోల్చి చూస్తే, పిల్లలకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
Also Read: Covid Third Wave: కేంద్రం కీలక నిర్ణయం.. యాంటిజెన్ టెస్ట్ కిట్ల ఎగుమతిపై ఆంక్షలు..