Covid Third Wave: కేంద్రం కీలక నిర్ణయం.. యాంటిజెన్ టెస్ట్ కిట్ల ఎగుమతిపై ఆంక్షలు..
Covid Rapid Antigen Test Kits: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా సమస్య ఇప్పుడే
Covid Rapid Antigen Test Kits: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా సెకండ్ వేవ్ అనంతరం.. కోవిడ్ కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. అయితే కరోనా సమస్య ఇప్పుడే ముగిసిపోలేదని.. థర్డ్ వేవ్ ప్రమాదం ఇంకా పొంచిఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో రోజూవారిగా నమోదవుతున్న కేసులు సైతం కొంతమేర కలవరపెడుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నిర్ధారించేందుకు ఉపయోగిస్తున్న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కిట్ల ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. థర్డ్వేవ్ ప్రమాదం పొంచిఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం ఎగుమతి విధానాలను సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
కోవిడ్-19 యాంటీజెన్ టెస్ట్ కిట్ల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్లు స్పష్టంచేసింది. వీటిని తక్షణమే ఆంక్షల కేటగిరీలో చేర్చుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ (డీజీఎఫ్టీ) ట్వీట్టర్ వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాంటిజెన్ కిట్లనే ఎక్కువగా కొవిడ్ పరీక్షల కోసం వినియోగిస్తున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షా ఫలితాల కంటే.. వేగంగా ఫలితాలు వస్తుండటంతో అందరూ యాంటిజెన్ కిట్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల కోసం ప్రయోగశాలలు అందుబాటులో లేకపోవడంతో.. యాంటిజెన్ కిట్లు కీలకంగా మారాయని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా థర్డ్వేవ్కు అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో ఈ కిట్ల లభ్యతను పెంచేందుకు కేంద్రప్రభుత్వం కిట్ల ఎగుమతిని ఆంక్షల జాబితాలో చేర్చింది. ఆంక్షల కేటగిరిలో ఉంచిన వస్తువులను ఎగుమతి చేయాలంటే ఎగుమతిదారులు డీజీఎఫ్టీ నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.
కాగా.. గడిచిన 24 గంటల్లో భారత్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. సోమవారం 25,166 కేసులు నమోదు కాగా.. 437 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 3,69,846 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 97.51 శాతంగా రికవరీ రేటు ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,22,50,679 కి చేరగా.. మరణాల సంఖ్య 4,32,079 కి పెరిగింది.
Also Read: