ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌకలో ప్రమాదం.. ఒకరు మృతి

| Edited By:

Jun 22, 2020 | 2:57 PM

విశాఖపట్టణంలోని ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌకలో ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్‌తో అందులో మెకానికల్ ఇంజనీర్‌గా

ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌకలో ప్రమాదం.. ఒకరు మృతి
Follow us on

విశాఖపట్టణంలోని ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ యుద్ధనౌకలో ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్‌తో అందులో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాహుల్ జంజీర్(19) అనే యువకుడు మృతి చెందారు. ఆదివారం విధుల్లో ఉన్న అతడికి షాక్ తగలడంతో స్పృహ తప్పి పడిపోగా వెంటనే సిబ్బంది ప్రాథమిక చికిత్సను అందించారు. ఆ తరువాత ఐఎన్‌హెచ్‌ఎస్ కళ్యాణి ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ రాహుల్ ఆదివారం రాత్రి కన్నుమూశారు. అంత్యక్రియల కోసం రాహుల్ మృతదేహాన్ని రాజస్థాన్‌లోని జుంజున్‌కి తరలించారు. మరోవైపు రాహుల్ మరణంపై ఐఎన్‌ఎస్ రాజ్‌పుత్ సిబ్బంది సంతాపాన్ని ప్రకటించారు.

Read This Story Also: నా పొరపాట్లకు రెండు సార్లు సచిన్ బలయ్యాడు.. నిద్రలేని రాత్రులు గడిపా