Corona Cases: దేశంలో విజృంభిస్తున్న కరోనా.. భారీగా కేసులు నమోదు..

|

Jan 21, 2022 | 9:44 AM

భారత్​లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు దేశంలో.. 3,47,254 కరోనా కేసులు వచ్చాయి...

Corona Cases: దేశంలో విజృంభిస్తున్న కరోనా.. భారీగా కేసులు నమోదు..
Coronavirus
Follow us on

భారత్​లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. భారీగా కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు దేశంలో.. 3,47,254 కరోనా కేసులు వచ్చాయి. కొత్తగా కరోనాతో మరో 703 మంది మరణించారు. వైరస్ నుంచి 2,51,777 మంది కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 17.94 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

భారత్​లో మొత్తం కేసులు సంఖ్యం 3,85,66,027 చేరింది. ‬మొత్తం మరణాలు 4,88,396కు చేరాయి. దేశంలో ప్రస్తుతం 20,18,825 ‬యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఒమిక్రాన్​ కేసులు సంఖ్య కూడా పెరుగుతున్నాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,692కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారత్​లో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. గురువారం ఒక్కరోజే 70,49,779 డోసులు ఇచ్చారు. ఇండియాలో ఇప్పటి వరకు 1,60,43,70,484 డోసులు వేశారు. గురువారం రోజు దేశవ్యాప్తంగా 19,35,912 కరోనా టెస్టులు నిర్వహించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 71.15 కోట్లకు చేరింది.

Read Also.. COVID-19 Study: వారిలో ఆరు నెలలకే తగ్గుతున్న ఇమ్యూనిటీ.. కీలక వివరాలు వెల్లడించిన ఏఐజీ అధ్యయనం..