Viral: ట్రాన్స్‌ఫార్మర్‌ లోడ్‌తో వెళ్తోన్న వాహనాన్ని ఆపిన పోలీసులు.. అనుమానంతో ఓపెన్‌ చేసి చూడగా.. సీన్‌ సితారే..

|

Jul 27, 2022 | 1:16 PM

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో నార్కొటిక్స్‌ బ్యూరో అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో ఒరిస్సా నుంచి రాజస్థాన్‌లోని కోట్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌ లోడ్‌తో వెళ్తోన్న ఓ వాహనాన్ని మధ్యలో ఆపారు. అనుమానం రావడంతో...

Viral: ట్రాన్స్‌ఫార్మర్‌ లోడ్‌తో వెళ్తోన్న వాహనాన్ని ఆపిన పోలీసులు.. అనుమానంతో ఓపెన్‌ చేసి చూడగా.. సీన్‌ సితారే..
Follow us on

Viral News: పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నా నేరాలు మాత్రం ఆగడం లేదు. పోలీసుల కంటే మితిమీరిన తెలివితో కేటుగాళ్లు నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా గంజాయి స్మగ్లింగ్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో గంజాయి స్మగ్లింగ్ యథేశ్చగా సాగుతోంది. పోలీసులు చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేస్తూ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తుంటే స్మగర్లు తెలివి మించిపోయి గంజాయిని చెక్‌పోస్ట్‌లను దాటిచ్చేస్తున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన పుష్ప సినిమాలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పుష్పరాజ్‌ వేసిన ఎత్తులను గుర్తు చేసింది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జైన్‌లో నార్కొటిక్స్‌ బ్యూరో అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. అదే సమయంలో ఒరిస్సా నుంచి రాజస్థాన్‌లోని కోట్‌కు ట్రాన్స్‌ఫార్మర్‌ లోడ్‌తో వెళ్తోన్న ఓ వాహనాన్ని మధ్యలో ఆపారు. అనుమానం రావడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ను విప్పి చూశారు. బయటకు అచ్చంగా ట్రన్స్‌ఫార్మర్‌లా కనిపిస్తున్నా వాటిలో గంజాయి ప్యాకెట్లు బయటపడడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వాహనంలో ఉన్న అన్ని ట్రాన్స్‌ఫార్మర్లను విప్పి చూడగా ఏకంగా 260 కిలోల గంజాయి బయటపడింది. దీంతో వాహనాన్ని సీజ్‌ చేసిన పోలీసులు, నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఇలాంటి స్మగ్లింగ్‌ కేసులు బయటపడడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు గంజాయి అక్రమార్కులు పోలీసులకు పట్టుబడ్డారు. రకరకాల మార్గాల్లో గంజాయిని రాష్ట్రాలు దాటేస్తున్నారు. వాహనాల ఫ్యూయల్‌ ఛాంబర్‌, కార్ల ఇంటీరియర్లలో గంజాయి రవాణా చేసిన సంఘటలు చోటుచేసుకున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..