హత్రాస్ హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగుతోన్న నేపథ్యంలో యూపీ సర్కార్ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందంలో అత్యంత నిజాయితీపరుడిగా పేరున్న చంద్ర ప్రకాష్ సభ్యుడిగా ఉన్నారు. తాజాగా ఆయన భార్య పుష్ప ప్రకాశ్ శనివారం లక్నోలోని తన నివాసంలో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలు వయసు 36 సంవత్సరాలు. ఆమె తన ముగ్గురు కుమార్తెలతో కలిసి లక్నోలోని సుశాంత్ గోల్ఫ్ సిటీలో నివశిస్తున్నారు.