అసలేం జరిగింది? నాగేంద్ర, దివ్య తేజస్విని మధ్య ఏం జరిగింది? నాగేంద్ర చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? నాగేంద్ర చెప్తున్న దాంతో దివ్య ఏకీభవిస్తుందా? ఇంతకీ ఇద్దరికి పెళ్లి జరిగిందా? దివ్య వర్షన్ ఏంటి? ఆమె అక్టోబర్ 3న ఇన్స్టా గ్రామ్లో మాట్లాడిన వీడియోను టీవీ9 ఎక్స్క్లూజీవ్గా సంపాదించింది. గడిచిన ఆరు నెలలుగా తాను సఫర్ అవుతున్నట్లు వీడియోలో చెప్పింది దివ్య. అసలు తనలో ఎలాంటి నెగెటివ్ షేడ్స్ లేవని దివ్య తన మాటల్లో పదే పదే చెప్తోంది. రియల్ దివ్య అసలు వేరంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఉన్న దివ్య డైలమాలో ఉంది. తనకు స్ట్రాంగ్ ఫ్యామిలీ ఉందంటూ వీడియోలో వివరించింది. నాగేంద్ర గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టింది. అతనో సైకో అని.. తన వెంట పడ్డాడని వివరించింది. రెండున్నర ఏళ్ల క్రితం నుంచి తమ ఇద్దరి మధ్య పరిచయం ఉన్నా.. అతని క్యారెక్టర్ ఏంటో తెలిసాక.. కట్ చేశానని చెప్పుకొచ్చింది. 2 ఏళ్ల తరువాత తన సైకోఇజం అర్థమైంది ఇన్స్టా లో చెప్పింది. తనకు థ్రెట్ కాల్స్, థ్రెట్ మెసేజ్లు వస్తున్నాయని ఇన్ స్టాగ్రామ్ లో లైవ్లో చెప్పింది దివ్య తేజస్విని. ఒక మహిళ వలన తాను మోసపోయానని బాధ పడింది. (దినేశ్ కార్తీక్ సంచలన నిర్ణయం..కోల్కతా కెప్టెన్సీ బాధ్యతలకు గుడ్ బై ! )
తాను మహిళా కాలేజీలో చదివాను అని చెప్పిన దివ్య.. మహిళగా నా లిమిట్స్ నాకు తెలుసు. అందుకే కంప్లైంట్ చేయాలేకపోయానంటూ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. 6 నెలలుగా బాధపడుతున్నానని.. తనను ఉన్నత స్థానంలో చూడాలని తన పేరెంట్స్ అనుకున్నారంటూ ఇన్ స్టా లైవ్లో చెప్పింది. నాకు థ్రెట్ కాల్స్, మెసేజ్లు వస్తూ ఉండేవి.. అయినా నాకు తన అన్న ఉన్నాడు అనే నమ్మకం ఉండేదన్న భరోసా వ్యక్తం చేసింది. తాను ఓ సైకోతో పోరాడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. తన కెరీర్ నాశనం చేయాలని అతను చూసాడని… అయినా తాను చాలా స్ట్రాంగ్గా ఉన్నా అని.. అన్నిటికీ పోరాడాలి అనుకుంటున్నా అంటూ వీడియోలో స్పష్టం చేసింది. ( ఆంధ్రప్రదేశ్ : సంబంధిత సబ్జెక్టుల్లో 40% మార్కులుంటేనే బీఎస్సీ సీటు ! )