తీహార్ జైలులో మర్డర్.. చెల్లి చావుకు పగ తీర్చుకున్న అన్న.!

| Edited By:

Jul 01, 2020 | 3:43 PM

చెల్లికి జరిగిన అన్యాయానికి కసి తీర్చుకున్న అన్న.. వినడానికి ఇది సినిమా కథాంశం మాదిరిగా ఉండొచ్చు. కానీ ఇదొక రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది.

తీహార్ జైలులో మర్డర్.. చెల్లి చావుకు పగ తీర్చుకున్న అన్న.!
Follow us on

చెల్లికి జరిగిన అన్యాయానికి కసి తీర్చుకున్న అన్న.. వినడానికి ఇది సినిమా కథాంశం మాదిరిగా ఉండొచ్చు. కానీ ఇదొక రియల్ స్టోరీ. కరుడుకట్టిన తీవ్రవాదులను ఉంచే తీహార్ జైలులో ఈ ఘటన చోటు చేసుకుంది. తన చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన ఆ నరరూప రాక్షసుడిని.. ఓ అన్న వెంటాడి వేటాడి హతమార్చాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన జాకీర్(21)కు ఒక్కగానొక్క చిట్టి చెల్లెలు. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న ఆమెపై 2014లో నిజాముద్దీన్ ప్రాంతానికి చెందిన మెహతాబ్(27) లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన జరిగిన తర్వాత ఆమె తీవ్ర మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితుడు మోహతాబ్‌కు శిక్ష పడేలా చేశారు. అనంతరం అతడిని తీహార్ జైలుకు తరలించారు.

అయితే జాకీర్ మాత్రం తన చెల్లెలిని రేప్ చేసి, మరణానికి కారణమైన మెహతాబ్‌పై పగ పెంచుకున్నాడు. అతన్ని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుని సరైన అవకాశం కోసం ఎదురుచూశాడు. పక్కా ప్రణాళికను రచించిన జాకీర్.. తీహార్ జైలులోనే మెహతాబ్‌ను హతమార్చాలని డిసైడ్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ నేరం చేసి జైలులోకి ఎంటర్ అయ్యాడు. అయితే మెహతాబ్ ఉంటున్న వార్డు.. తాను ఉంటున్న వార్డు వేరు కావడంతో జాకీర్ మరో ప్లాన్ వేశాడు. తన వార్డులో ఉన్న ఖైదీలపై దాడి చేశాడు. దీనితో జైలు అధికారులు జాకీర్‌ను మెహతాబ్ వార్డులోకి మార్చారు.

కాగా, జూన్ 27న ఖైదీలందరూ ప్రార్ధన చేసే సమయంలో మెహతాబ్‌ను హత్య చేయాలని పక్కాగా స్కెచ్ రచించాడు జాకీర్. మెహతాబ్ బయటికి రాగానే అతడి శరీరంపై పదునైన కత్తితో దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర గాయాలైన మెహతాబ్‌ను జైలు అధికారులు స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. ఇలా తన చెల్లెలికి జరిగిన అన్యాయానికి ఓ అన్న పగ తీర్చుకున్నాడు.

Also Read: చైనాపై మరో యుద్ధానికి భారత్ సిద్ధం.. ఈసారి అంతకుమించి..!