Hyderabad Woman Committed Suicide attempt: హైదరాబాద్ మహానగర శివారులో ఓ యవతి అనుమానాస్పదస్థితిలో ఆత్మహత్యయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సన్ సిటీ లోని నిర్మానుష ప్రదేశంలో కవిత అనే మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు సగం కాలిన బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అయితే, యవతి ఆత్మహత్యాయత్నంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తానే స్వయంగా నిప్పంటించుకుందా..? లేక హత్య యత్నం జరిగిందా అనే కోణంలో రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కవిత అనే మహిళ బండ్లగూడ నివాసిగా గుర్తించారు సన్ సిటీ ప్రాంతానికి నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో చెట్ల పొదల్లోకి వెళ్లి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉండడం పక్కనే కిరోసిన్ బాటిల్తో పాటు మద్యం ఉండడం హత్యాయత్నంపై పలు అనుమానాలకు దారితీశాయి. మరోవైపు దాదాపుగా 90% కాలిన గాయాలతో ఉన్న మహిళని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ఈ సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ ఏ సి పి గంగాధర్ ఈ దారుణానికి సంబంధించి క్లూస్ సహాయంతో పరిశీలించారు.
Read Also…. Viral Video: చలివేస్తేనే కూతురు స్టైల్ మరచిపోయి.. శాలువా కోరుతుంది అంటున్న తల్లి.. వీడియో వైరల్..