ఒక్కప్పుడు అవి వస్తే గ్రామాల్లో పండుగ.. ఇప్పుడు వస్తున్నాయంటేనే అక్కడివారిలో వణుకు

|

Jan 12, 2021 | 7:54 AM

వేల మైళ్ల దూరం. రోజులు, వారాలు, నెలల తరబడి ప్రయాణం. ఎక్కడో విదేశాల్లో జీవం పోసుకున్న ఈ పక్షులు ప్రతియేటా చలికాలం విడిదికోసం ఇక్కడికి వస్తున్నాయి‌. తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో..

ఒక్కప్పుడు అవి వస్తే గ్రామాల్లో పండుగ.. ఇప్పుడు వస్తున్నాయంటేనే అక్కడివారిలో వణుకు
Follow us on

Migrate Siberian Cranes : వేల మైళ్ల దూరం. రోజులు, వారాలు, నెలల తరబడి ప్రయాణం. ఎక్కడో విదేశాల్లో జీవం పోసుకున్న ఈ పక్షులు ప్రతియేటా చలికాలం విడిదికోసం ఇక్కడికి వస్తున్నాయి‌. తెలుగురాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు మూడు నెలలపాటు బసచేసి తెగ సందడి చేస్తుంటాయి. వింటర్‌ విడిదికోసం వచ్చే ఈ సైబీరియన్‌ కొంగలు ఇప్పుడు స్థానికులకు వణుకుపుట్టిస్తున్నాయి. ఒకప్పుడు వాటిని చూస్తే చాలు ఆనందంతో ఉండే పల్లెజనం ..ఇప్పుడు హడలిపోతున్నారు. వాటిని తరిమేందుకు సిద్ధమయ్యారు.

ఆస్ట్రేలియా దేశానికి చెందిన ఈ సైబీరియన్‌ కొంగలు ప్రతియేటా చూపరులను కనువిందు చేస్తుంటాయి. ఎర్రటి పొడవాటి ముక్కుతో సంచరించే ఈ కొంగలను చూస్తే ..ఎలాంటి వారైనా మంత్ర ముగ్గులైపోతారు. ఎన్ని విపత్తులు ఎదురైనా..భూకంపాలు సంభవింనా సరే ఈ పక్షులు మాత్రం ఖచ్చితంగా డిసెంబర్‌- జనవరి మాసంలో ఇక్కడ వాలిపోతుంటాయి. ప్రజలు కూడా విడిదికోసం వచ్చిన అతిథులుగా ఆహ్వానిస్తుంటారు.

ఈ పక్షులు తెలంగాణలోని కొన్ని సెలెక్టెడ్‌ గ్రామ పరిసరాల్లో మాత్రమే సంచరిస్తుంటాయి. వరంగల్‌ ఉమ్మడిజిల్లాలో వీటి సందడి అంతా ఇంతా కాదు. జనగామజిల్లాలోని చిన్నమడూరు ప్రాంతంలో నెలల తరబడి తెగ హడావిడి చేస్తుంటాయి. అటు మహబూబాబాద్‌జిల్లాలోని మాల్యాల, మాదాపురం గ్రామ పరిసరాల్లోనూ సందడి చేస్తుంటాయి. గతేడాది వరంగల్‌ రూరల్‌జిల్లా పాకాల సరస్సు ప్రాంతంలో 40 రకాల విదేశీ పక్షులను గుర్తించారు. ఈ పక్షులు వస్తే ఊరంతా పచ్చగా ఉంటుందని స్థానికులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి :

Lamba Investigation : ఆన్‌లైన్ లోన్ యాప్ మనీ దందా వెనుక ఓ మహిళ.. తీగ లాగుతున్న సైబర్‌క్రైమ్‌ పోలీసులు