సరూర్‌నగర్‌లో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి

|

Sep 20, 2020 | 10:55 PM

సిటీలోని సరూర్‌నగర్‌ తపోవన్ కాలనీలో నవీన్ కుమార్ అనే వ్యక్తి వరదలో కొట్టుకుపోవడంతో కలకలం చెలరేగింది. 

సరూర్‌నగర్‌లో వరదలో కొట్టుకుపోయిన వ్యక్తి
Follow us on

సిటీలోని సరూర్‌నగర్‌ తపోవన్ కాలనీలో ఓ వ్యక్తి వరదలో కొట్టుకుపోవడంతో కలకలం చెలరేగింది.  స్కూటీపై వెళ్తున్న నవీన్ కుమార్ అనే వ్యక్తి అందరూ చూస్తుండగానే  వరద నీటిలో పడి  కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. బాలాపూర్‌ ఏరియాలోని సుమారు 35 కాలనీలకు చెందిన వరదనీరు మినీ ట్యాంక్‌బండ్‌లో కలుస్తోంది. భారీ వర్షం కురవడంతో మినీ ట్యాంక్‌బండ్‌కు వరదనీరు వెళ్తున్న మార్గంలో తపోవన్‌ కాలనీ వద్ద కాసేపు ఆగిన నవీన్ కుమార్.. ఒక్కసారిగా వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో  స్కూటీ పై నుంచి అదుపుతప్పి వరదనీటిలో పడిపోయాడు.

వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నం  చేసినా, ఫలితం దక్కలేదు. గల్లంతైన వ్యక్తి కోసం  జీహెచ్‌ఎంసీ రెస్య్కూ టీమ్, పోలీసులు గాలిస్తున్నారు. ఇటీవల నేరేడ్‌మెట్‌లోని దీన్‌దయాళ్ నగర్‌ కాలనీలో సుమేధ అనే బాలిక సైకిల్‌పై వెళ్తూ నాలాలో కొట్టుకుపోయి మరణించిన విషయం తెలిసిందే.


Also Read :

తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం

20 బంతుల్లో స్టోయినిస్‌ హాఫ్ సెంచరీ