20 బంతుల్లో స్టోయినిస్ హాఫ్ సెంచరీ
ఢిల్లీ బ్యాట్స్మన్ మార్కస్ స్టోయినిస్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 21 బంతుల్లో 53 (7x4, 3x6) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
ఢిల్లీ బ్యాట్స్మన్ మార్కస్ స్టోయినిస్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 21 బంతుల్లో 53 (7×4, 3×6) పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. మొదట్నుంచి ఢిల్లీ బ్యాట్స్మన్ ను కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు స్టోయినిస్ ముందు తేలిపోయారు. స్టోయినిస్ విజృంభణతో ఢిల్లీ 157 పరుగులు చేయగలిగింది. అంతకుముందు మెయిన్ బ్యాట్స్మెన్ అంతా విఫలమయ్యారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (39; 32 బంతుల్లో 3×6), రిషభ్ పంత్ (31; 29 బంతుల్లో 4×4) కాసేపు నిలకడగా ఆడటంతో పరిస్థితి మెరుగుపడింది. లేదంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ జట్టును షమి బెంబేలెత్తించాడు. మొదటి 13 పరుగులకే ఓపెనర్లు పృథ్వీషా(5), శిఖర్ ధావన్(0) సహా షిమ్రన్ హెట్మెయిర్(7) వరుసగా పెవిలియన్ చేరారు. అనంతరం పంత్, శ్రేయస్ జాగ్రత్తగా స్కోర్ బోర్డు ముందుకు నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 73 రన్స్ జోడించారు. స్కోర్ 86 పరుగుల వద్ద తొలుత పంత్ బిష్ణోయ్ బౌలింగ్లో బౌల్డ్ అవ్వగా తర్వాతి ఓవర్లోనే శ్రేయస్ కూడా షమి బౌలింగ్లో ఔటయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టోయినిస్ వరుస బౌండరీలతో దుమ్మురేపాడు. చివరి ఓవర్లో అతడు రెండు సిక్సులు, మూడు ఫోర్లు బాదడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి అతడు రనౌటయ్యాడు. అయితే, అది నోబాల్ కావడంతో ఢిల్లీకి చివర్లో అదనపు బంతి లభించింది
Also Read : తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం : ముగ్గురు యువకులు దుర్మరణం