గ్రౌండ్ లోకి దిగాడంటే చాలు వీర బాదుడే అతని లక్ష్యం. కేవలం టీ20లలో మాత్రమే కాదు, వన్డేలు, టెస్టుల్లో కూడా అదే దూకుడు కొనసాగించడం అతడి నైజం. అందుకే రికార్డులన్నీ అతడికి దాసోహం. ఇప్పటికే అతడెవరో మీరు తెలిసిపోయే ఉంటుంది. అవును మేము మాట్లాడుతుంది ముంబై ఇండియన్స్ కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురించే. తాజాగా ఈ క్రేజీ ప్లేయర్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో 5 వేల పరుగుల మార్కు అందుకున్న మూడో క్రికెటర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. విరాట్ కోహ్లీ, సురేశ్ రైనాలు ఇతడికంటే ముందున్నారు.