తాలుకు కూడా అదిరే రేటు !

|

Sep 25, 2020 | 12:45 PM

మిర్చి రైతులకు ఈ ఏడాది పంట లాభదాయకంగానే  ఉంది. కరోనా హడావిడి లేకపోతే మిర్చి రైతు పరిస్థితి ఇంకా బాగుండేది.

తాలుకు కూడా అదిరే రేటు !
Follow us on

మిర్చి రైతులకు ఈ ఏడాది పంట లాభదాయకంగానే  ఉంది. కరోనా హడావిడి లేకపోతే మిర్చి రైతు పరిస్థితి ఇంకా బాగుండేది. ఖమ్మంలో అయితే మేలిమి రకం మిర్చి ధర ఈ రోజు రూ.20 వేలు దాటింది. మరోవైపు ఎన్నడూ లేని విధంగా ఈసారి తాలుకు కూడా మంచి డిమాండ్ వస్తుంది. వర్షాలకు కాయలు తడిస్తే నాణ్యత లోపించి తెల్లగా మారతాయి. వీటిని తక్కువ ధరకు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది పంట చేతికందే సమయంలో సాధారణ రకం తాలు క్వింటా రూ.3500 ఉండగా ప్రస్తుతం రూ.6 వేల వరకు పలుకుతుంది. తేజ రకం తాలు 2 నెలల క్రితం రూ.4 వేలు ఉండగా ఇప్పుడు రూ.7500 నుంచి రూ.9000 వరకు పలుకుతుంది. గుంటూరు మార్కెట్లో గురువారం తేజ రకం తాలు రూ.9,200 పలికింది. ఇలా అనూహ్యంగా పెరుగుతున్న ధరలు రైతులను అయోమయానికి గురి చేస్తున్నాయి. అమ్ముదామంటే ధర మరింత పెరిగితే వచ్చే ఆదాయం కోల్పోతామని ఆలోచిస్తున్నారు. కోల్డ్ స్టోరేజీలోనేే ఉంచుదామంటే  ధర తగ్గుతుందేమోనని భయపడుతున్నారు. రేటు అధికంగా ఉండటంతో ఈ ఏడాది మిర్చి సాగు గణనీయంగా పెరిగింది.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు