రుతుపవనాల ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే భారీ వర్షపాతం నమోదయ్యింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలో కూడా ఈసారి వర్షాల తీవ్రత అధికంగా ఉంది. కాగా నేటి నుంచి అయిదు రోజుల పాటు తెలంగాణ, కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రెండు రోజులు దక్షిణ బంగాళాఖాతం, తర్వాత మధ్య బంగాళాఖాతంలో 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ క్రమంలో మత్స్యకారులు ఆ దిశగా వేటకు వెళ్లరాదని వాతవరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు వేసే తెరపి కూడా ఇవ్వడం లేదు వానలు. నేల కాస్త ఆరిందని అన్నీ సిద్దం చేసుకునేలోపే మళ్లీ జల్లులు పడుతున్నాయి. మరికొన్ని చోట్లు ఎడతెరపి లేని వర్షాల వల్ల కలుపు బాగా పెరిగి అన్నదాతలకు ప్రాణసంకటంగా మారింది.
Read More : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఆర్బీకేల్లో మార్కెటింగ్ సేవలు