చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం

|

Oct 09, 2020 | 8:19 PM

చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. తనకు అడ్డువచ్చిన గ్రామస్థులపై దాడికి తెగబడ్డాడు.

చిత్తూరు జిల్లాలో సైకో వీరంగం
Follow us on

చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం మాదిరెడ్డి పల్లె గ్రామంలో శుక్రవారం సురేష్ అనే వ్యక్తి సైకోలా ప్రవర్తించాడు. తనకు అడ్డువచ్చిన గ్రామస్థులపై దాడికి తెగబడ్డాడు. సురేష్‌ సైకో ప్రవర్తనతో విసిగిపోయిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే స్థానిక ఎస్‌ఐ నాగేశ్వరరావు సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. సురేష్‌ను పట్టుకోవడానికి  ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో సురేశ్‌ చేతిలో ఉన్న కర్రతో  పోలీసులపై దాడికి దిగాడు.  ఎస్ఐ నాగేశ్వరరావును గాయపరిచే ప్రయత్నం చేశాడు. అతి కష్టం మీద సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం చిత్తూర్ హాస్పిటల్‌కి తరలించారు. కాగా సురేష్ ఆసుపత్రి‌ సిబ్బందిపై కూడా దాడి చేయబోయాడు. ఇతగాడిపై గతంలో అత్యాచారం, హత్య కేసులు ఉన్నాయని ఎస్‌ఐ నాగేశ్వరరావు తెలిపారు.

Also Read :

ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ

రైతులకు జగన్ సర్కార్ మరిన్ని వరాలు, ఉచితంగానే మోటార్లు, పంపు సెట్లు