హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ !

|

Sep 25, 2020 | 5:14 PM

హైదరాబాద్ లో కలకలం రేపిన హేమంత్ పరువు హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిరాయి హంతకుల చేత హేమంత్ ను అవంతి  మేనమామ యుగంధర్ రెడ్డి చంపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

హేమంత్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ !
Follow us on

హైదరాబాద్ లో కలకలం రేపిన హేమంత్ పరువు హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కిరాయి హంతకుల చేత హేమంత్ ను అవంతి  మేనమామ యుగంధర్ రెడ్డి చంపించినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. హేమంత్ హత్య కోసం యుగంధర్ పది లక్షలు ఇచ్చినట్లు తెలిపారు. వట్టినాగులపల్లి , గోపనపల్లికి చెందిన ఇద్దరు కిరాయి హంతకులతో బేరం కుదుర్చుకున్నాడు యుగంధర్.  యుగంధర్ తో పాటు 12 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన, మేనమామ యుగంధర్‌రెడ్డితో పాటు బంధువులు రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, సంతోశ్‌రెడ్డి, సందీప్ రెడ్డి, డ్రైవర్ సాహెబ్ పటేల్, స్పందన, స్వప్న, రజిత, అర్చనపై కేసులు నమోదు చేశారు పోలీసులు.

హేమంత్‌ను కిడ్నాప్‌ చేసిన కిరాయి గూండాలు అతడిని దారుణంగా హతమార్చినట్టు తెలుస్తోంది. హేమంత్‌ మొహం నిండా రక్తపు మరకలు ఉన్నాయి. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. హేమంత్‌ చేతుల్ని వెనక్కి కట్టేసి ముఖంపై పిడి గుద్దులు గుద్ది అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిన తర్వాత .. మెడకు తాడుతో గట్టిగా ఉరి వేసి చంపినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

బాలూ, నువ్వు లేకుండా ఎలా ..?