Minister KTR: ఆరు అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. వీటిని ఏ ఆస్పత్రులకు కేటాయించారంటే..

Minister KTR: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధితుల కోసం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన

Minister KTR: ఆరు అంబులెన్స్‌లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. వీటిని ఏ ఆస్పత్రులకు కేటాయించారంటే..
Follow us

|

Updated on: Jan 11, 2021 | 1:49 PM

Minister KTR: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా కరోనా బాధితుల కోసం గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరు అంబులెన్స్‌లను అందించారు. అయితే ప్రగతి భవన్‌లో అంబులెన్స్‌లను కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, జీవన్ రెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు వైద్య సేవల నిమిత్తం రూ.1.23కోట్ల వ్యయంతో ఆరు నూతన అంబులెన్స్‌లను అందించామని తెలిపారు. వీటిని ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ కు కేటాయించనున్నారు. ఈ అంబులెన్స్‌లను ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సమయం వృధా కాకుండా బాధితులను నిర్ణీత సమయంలో ఆసుపత్రికి చేర్చుతాయాని పేర్కొన్నారు. జిల్లాకు 6 అంబులెన్స్‌లను అందించడం పట్ల మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, ప్రజాప్రతినిధులు ఎంపీ నామాకు అభినందనలు తెలియజేశారు.

Telangana Minister KTR: నిధులు కేటాయించండి.. కేంద్ర మంత్రులకు లేఖ రాసిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

స్థిరాస్తి వ్యాపారానికి ప్రోత్సాహం ఇచ్చేలా పురపాలక శాఖ కీలక ఉత్తర్వులు