విద్యార్ధులకు AICTE గుడ్ న్యూస్ అందించింది. ఇక నుంచి మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(MCA) కోర్సు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానం అమలులోకి వస్తుందని పేర్కొంది.
ఇక నుంచి ఎంసీఏ మూడేళ్ల(6 సెమిస్టర్లు)కు బదులుగా రెండేళ్ల(4 సెమిస్టర్లు)లో పూర్తి చేస్తే పట్టా పొందవచ్చు. MCA కోర్సుకు ఆదరణ తగ్గిపోతుండటం వల్ల AICTE ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కాగా, ఎంసీఏ కోర్సు వ్యవధి కుదింపు ప్రతిపాదనకు గతేడాది యూజీసీ ఆమోదముద్ర వేసిన సంగతి విదితమే.
Important Announcement @ #AICTEdge:
Change in the duration of #MCA Program from 3 years to 2 years w.e.f. 2020-21 has been approved.
Details: https://t.co/HokQ2EJ8ZN@HRDMinistry @DrRPNishank @SanjayDhotreMP @PIBHRD @mygovindia @ugc_india #AICTE pic.twitter.com/t3VvJn29EI
— AICTE (@AICTE_INDIA) July 7, 2020