కరోనా లాక్‌డౌన్.. మెడికల్‌ షాపులో మద్యం అమ్మకం!

| Edited By:

Apr 15, 2020 | 4:06 PM

కోవిద్-19 మహమ్మారి విజృంభణతో లాక్‌డౌన్ పొడిగించాల్సిన వచ్చింది. లాక్‌డౌన్ క్రమంలో బార్లు, లిక్కర్ షాపులు అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో మందు బాబులు నానాతిప్పలూ పడుతున్నారు. వీరి దురవస్థను క్యాష్

కరోనా లాక్‌డౌన్.. మెడికల్‌ షాపులో మద్యం అమ్మకం!
Follow us on

కోవిద్-19 మహమ్మారి విజృంభణతో లాక్‌డౌన్ పొడిగించాల్సిన వచ్చింది. లాక్‌డౌన్ క్రమంలో బార్లు, లిక్కర్ షాపులు అన్నీ బంద్ అయిపోయాయి. దీంతో మందు బాబులు నానాతిప్పలూ పడుతున్నారు. వీరి దురవస్థను క్యాష్ చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో వెలుగుచూసిన ఉదంతమే దీనికి నిదర్శనం. నాగ్‌పూర్‌లోని గణేష్‌పేట్ ప్రాంతంలోని ఓ మెడికల్ షాపు యజమాని లాక్‌డౌన్ నిబంధనలను క్యాష్ చేసుకోవాలనుకున్నాడు.

కాగా.. తన మెడికల్ షాపులోనే అక్రమంగా బీర్ అమ్మకం మొదలెట్టేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు షాపుపై రెయిడ్ చేశారు. మంచినీళ్ల బాటిళ్లలో బీర్ పోసి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో షాపు యజమాని నిషాంత్ అలియాస్ బంటీ ప్రమోద్ గుప్తా(36)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: లాక్‌డౌన్ 2.0: హైదరాబాద్‌లో నయా రూల్స్.. ఫాలో అవ్వాల్సిందే..

Also Read: కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో ఈ ఐదు జిల్లాలు సేఫ్..!