కేసు పెట్టిన భార్య.. పీఎస్ ఎదుట భర్త ఆత్మహత్య

|

Sep 16, 2020 | 11:58 AM

భార్యభర్తల మధ్య చిన్న, చిన్న తగాదాలు సహజం. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇరువురి మధ్య చిన్న, చిన్న విబేధాలు తలెత్తడం కామన్. సర్దుకుపోయి ముందుకు పోతే సంసారం పచ్చగా సాగిపోయింది.

కేసు పెట్టిన భార్య.. పీఎస్ ఎదుట భర్త ఆత్మహత్య
Follow us on

భార్యభర్తల మధ్య చిన్న, చిన్న తగాదాలు సహజం. విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన ఇరువురి మధ్య చిన్న, చిన్న విబేధాలు తలెత్తడం కామన్. సర్దుకుపోయి ముందుకు పోతే సంసారం పచ్చగా సాగిపోయింది. ప్రతి చిన్న ఇష్యూకి నువ్వెంత అంటే, నువ్వెంత అనకుంటే కాపురంలో కల్లోలం మొదలువుతుంది. తాజాగా భార్య తనపై కేసు పెట్టినందుకు మనో వేదనకు గురైన భర్త… పోలీసు స్టేషన్ వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. వట్టిచెరుకూరుకు చెందిన ఇన్నారావు, జ్యోతి అలేఖ్య భార్యభర్తలు. కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇటీవల భార్య జ్యోతి ఇటీవల సూసైడ్ అంటెమ్ట్ చేసింది. ఆస్పత్రిలో చికిత్స అనంతరం తిరిగి కోలుకుని ఇంటికి వచ్చింది.

ఇద్దరి మధ్య గొడవలు ముదిరి… భర్తపై భార్య జ్యోతి పోలీసుస్టేషన్ లో కంప్లైంట్ చేసింది. కేసు నమోదుతో మనస్తాపానికి భర్త ఇన్నారావు ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే పొన్నూరు ఆస్పత్రికి తరలిచంగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Also Read :

టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు సుదర్శన్ రావు కన్నుమూత

విచారణకు పిలిస్తే, మాజీ రౌడీషీటర్ ఆగమాగం