Sarkaru Vaari Paata : సంక్రాంతి తర్వాతే ‘సర్కారు వారి పాట’ షూటింగ్ మెదలుకానుందా..?

|

Jan 01, 2021 | 8:08 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్..

Sarkaru Vaari Paata : సంక్రాంతి తర్వాతే సర్కారు వారి పాట షూటింగ్ మెదలుకానుందా..?
Follow us on

Sarkaru Vaari Paata : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘సర్కారు వారి పాట’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపధ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రీలుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇక ఈ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో మహేష్ బ్యాంక్ మేనేజర్ కోడుకుగా కనిపించనున్నాడట. అంతే కుండా మహేష్ లుక్ కూడా చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. పొడవాటి జుత్తుతో మెడ పైన ట్యాటూతో మాస్ లుక్ లో కనిపించనున్నాడు మహేష్. ఇప్పటికే ఈ సినిమా కోసం రామోజీ ఫిలింసిటీలో బ్యాంక్ సెట్ కూడా వేసారు. ఇదివరకే అమెరికాలో షూటింగ్ జరపాల్సిన షెడ్యూల్ ఉండగా.. అక్కడ కరోనా కేసులు వ్యాప్తి, వీసా ప్రాబ్లెమ్స్ వలన షూటింగ్ ఇండియాకి మార్చారట. అయితే షూటింగ్ జనవరి మెదటి వారం నుంచి మెదలుపెట్టాలని భావించినప్పటికీ మహేష్ సంక్రాంతి తర్వాత షూటింగ్ మొదలుపెడదామని మేకర్స్ కు సూచించాడట. ఇక ఈ సినిమాను మైత్రిమూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి.

also read : Rhea Chakraborty : మళ్లీ కెమెరాముందుకు రానున్న సుశాంత్ ప్రేయసి… సినిమాతోపాటు రియాలిటీ షో కూడా..