KCR Key Decision: తెలంగాణ సీఎం కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి గుడ్ న్యూస్ అందిస్తూ.. వారి విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రంలో బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుండగా.. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణలో ఈడబ్ల్యూఎస్లతో కలిపి 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. దీనికి సంబంధించి విధివిధానాలను ఉన్నతస్థాయి అధికారులతో చర్చించి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది.
Also Read:
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఫిబ్రవరి కోటా దర్శన టికెట్లు విడుదల..
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఏపీ డీజీపీ విరాళం.. ఎంత ఇచ్చారంటే..!